నేడు విజయవాడలో ఏపి మంత్రివర్గ సమావేశం

ఇవ్వాళ్ళ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రాష్ట్రాన్ని పట్టి కుదిపివేస్తున్న కాల్ మనీ వ్యవహారంపైన ప్రధానంగా చర్చించవచ్చును. ఈ వ్యవహారంలో ఎక్కువగా తెదేపా నేతల పేర్లే బయటపడుతుండటంతో దాని వలన పార్టీకి, ప్రభుత్వానికి కూడా చాలా చెడ్డపేరు వస్తోంది. అలాగే ఈ కాల్ మనీ అక్రమ వ్యాపారం రాష్ట్రంలో మిగిలిన జిల్లాలలో కూడా వ్యాపించి ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారం ఇంకా కొనసాగినట్లయితే పార్టీకి, ప్రభుత్వానికి కూడా తీవ్ర నష్టం జరుగుతుంది కనుక వీలయిననంత త్వరగా దీనిని అరికట్టడానికి తీసుకోవలసిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ వ్యవహారంతో సంబందం ఉన్న తెదేపా నేతలపై పార్టీ పరంగా, ప్రభుత్వపరంగా తీసుకోవలసిన చర్యలు గురించి ఈ సమావేశంలో చర్చించవచ్చును. అలాగే కల్తీ మద్యం కేసు, అక్రమ ఇసుక రవాణా వంటి సమస్యల గురించి చర్చించే అవకాశం ఉంది. త్వరలో జరుగబోయే శాసనసభ సమావేశాలలో చర్చించవలసిన అంశాలు, ప్రవేశపెట్టవలసిన బిల్లుల గురించి ఈరోజు మంత్రివర్గ సమావేశంలో చర్చించవచ్చును. ప్రస్తుతం అమలులో ఉన్న ఇసుక సరఫరా విధానంలో కనుగొన్న లోపాలను సరిచేసి జనవరి నుండి కొత్త ఇసుక విధానం అమలుచేయబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. కనుక ఈ సమావేశంలో దానిపై కూడా చర్చ జరుగవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close