నేడు కేంద్రమంత్రులతో చంద్రబాబు సమావేశం

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సింగపూర్ పర్యటన ముగించుకొని నిన్న సాయంత్రం డిల్లీ చేరుకొన్నారు. ఈరోజు ఉదయం నీతి ఆయోగ్ ఉపకమిటీ సమావేశంలో పాల్గొన్న తరువాత హోం మంత్రి రాజ్ నాద్ సింగ్, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, వ్యవసాయ శాఖామంత్రి రాధామోహన్, పట్టనాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్య నాయుడు, పౌర విమానయాన శాఖా మంత్రి అశోక్ గజపతిరాజులతో వరుసగా సమావేశం అవుతారు. రేపు ఉదయం విజయవాడకు చేరుకొంటారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదాకి బదులుగా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించినందున దాని గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్దికమంత్రితో చర్చించే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈనెల 26నుండి గుంటూరులో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నందున రాష్ట్రంలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ఇంకా ఆలస్యం చేసినట్లయితే తెదేపా, బీజేపీలు రెండూ కూడా రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి రావడమే కాకుండా, చేజేతులా ప్రతిపక్షాలకి అవకాశం ఇచ్చినట్లవుతుంది. కనుక వీలయినంత త్వరగా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీని ఖరారు చేయవలసిందిగా ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని చంద్రబాబు నాయుడు కోరవచ్చును. వైజాగ్, విజయవాడ మెట్రో రైల్ సమగ్ర నివేదికలు అందాయి కనుక వాటి నిర్మాణానికి ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వ సహాయం అర్ధించవచ్చును. వచ్చేనెల 22న అమరావతి శంఖు స్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీని ఇంతకు ముందే ఆహ్వానించారు కనుక ఇప్పుడు కేంద్రమంత్రులను కూడా ముఖ్యమంత్రి ఆహ్వానించవచ్చు.

రాష్ట్ర విభజన హామీలలో భాగంగా ఇప్పటికే కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో ఐదు ఉన్నత విద్యాసంస్థలను, ఎయిమ్స్ ఆసుపత్రిని మంజూరు చేసింది. కానీ ఇంకా వ్యవసాయ, గిరిజన, పెట్రోలియం యూనివర్సిటీలను ఏర్పాటు చేయవలసి ఉంది. వాటి ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి ఈరోజు కేంద్రమంత్రులతో చర్చిస్తారని సమాచారం. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి గురించి ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీపై ఒత్తిడి చేయవచ్చును.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రయత్నలోపం లేకుండా రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల గురించి కేంద్రంపై నిరంతరం ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. కానీ కేంద్రప్రభుత్వం నుండి సానుకూల స్పందన తప్ప నిర్దిష్టమయిన ఎటువంటి ప్రకటన వెలువడటం లేదు. కనీసం ఈసారయినా రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే ప్రకటన చేయించగలిగితే ప్రజలు కూడా హర్షిస్తారు. లేకుంటే ప్రతిపక్షాల నుండి మళ్ళీ విమర్శలు ఎదుర్కోక తప్పదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close