ఇప్పుడు బాబు డిల్లీ వెళ్ళినా ఆశల్లేవు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం డిల్లీ చేరుకొన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన డిల్లీలో జరిగే ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రేపు వరుసగా పర్యాటక శాఖ, రైల్వే శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్ధిక శాఖ మంత్రులతో రేపు చంద్రబాబు నాయుడు వరుసగా సమావేశం అవుతారు. రేపు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడితో సమావేశం అవుతారు.

చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో డిల్లీ వెళ్తే దానిపై రాష్ట్ర ప్రజలు కోటి ఆశలు పెట్టుకొనేవారు. ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్, పోలవరం, పరిశ్రమలు, ప్రాజెక్టులు వంటివేవో ఆయన సాధించుకు వస్తారని అందరూ ఆశగా ఎదురుచూసేవారు. ప్రధాని నరేంద్ర మోడి కూడా రాష్ట్రానికి చాలా హామీలు ఇచ్చి ఉన్నారు కనుక ఆయన తప్పకుండా ఏదో ఒక బారీ సహాయం చేస్తారని ప్రజలందరూ చాలా ఆశగా ఎదురుచూసేవారు. ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పినా ఆంధ్ర ప్రజలు పరిస్థితులు అర్ధం చేసుకొని ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజితో సర్దుకుపోయేందుకు మానసికంగా సిద్దపడ్డారు. కానీ అదివ్వడానికి కూడా కేంద్రానికి చేతులు రావడం లేదు!

అమరావతి శంఖుస్థాపన సమయంలో ప్రధాని మోడీ డిల్లీ నుండి నీళ్ళు, మట్టి తెచ్చి చంద్రబాబు చేతిలో పెట్టి వెళ్ళిపోయినప్పటి నుండి రాష్ట్ర ప్రజల భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి. అప్పటి నుండే కేంద్రంపై పూర్తిగా ఆశలు వదిలేసుకొన్నారు. కనుక ఇప్పుడు చంద్రబాబు డిల్లీ వెళ్ళినా ఇదివరకులాగ మీడియా కూడా దానిని పెద్దగా హైలైట్ చేయడం లేదు. పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.

రెండు సం.లు పూర్తి కాక మునుపే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై భ్రమలన్నీ తొలగిపోతున్నాయి. నరేంద్ర మోడీని చంద్రబాబు పొగుడటం… చంద్రబాబుని వెంకయ్య నాయుడు పొగడటం…ఇలాగ ఒకరినొకరు పొగుడుకొంటూ కాలక్షేపం చేసేస్తున్నారు తప్ప ఎన్నికలలో హామీ ఇచ్చినట్లుగా  రాజధాని, పోలవరం, మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణం వంటి పనులేవీ మొదలుపెట్టనేలేదు.

ఈ 21 నెలలలో కాగితాల మీద, గాలిలో మేడలు కట్టుకొని అవి చూసి భుజాలు చరుచుకోవడం తప్ప కొత్తగా చేసిందేమీ కనబడటం లేదు. అప్పుడే చూస్తుండగానే రెండేళ్ళు పూర్తయిపోతున్నాయి. చూస్తుండగానే మిగిలిన మూడేళ్ళు కూడా పూర్తయిపోవచ్చును. ఇంతకాలంగా జరగనిది మిగిలిన ఆ మూడేళ్ళలో జరిగిపోతుందని ఆశించలేము కూడా.

రాష్ట్ర ప్రభుత్వం చేతిలో డబ్బు లేకపోవడం వలన అది నిస్సహాయ పరిస్థితిలో ఉందని సర్ది చెప్పుకోవచ్చును. కానీ కేంద్రప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు బారీ ఆర్ధిక ప్యాకేజీలు ప్రకటిస్తూ ఒక్క ఆంధ్రప్రదేశ్ పట్లనే ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close