లాటరీ టిక్కెట్ ట్రైల్ రన్ ఫెయిల్ !

ఏపీలో లాటరీ టిక్కెట్లు ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. గతంలో ఉన్నతాధికారులను లాటరీలు అమల్లో ఉన్న రాష్ట్రాలకు పంపి విధివిధానాలపై కసరత్తు చేసింది. అయితే ఇప్పటి వరకూ అమలు చేయలేదు. ఇప్పుడు కొత్తగా ఆ ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా విజయనగరం జిల్లాలో మూడు బైకుల లక్కీ డ్రాను రవాణాశాఖ అధికారులు ప్రారంభించారు. మూడు లక్షల పెట్టి మూడు బైకులు ఇస్తారు.కానీ జిల్లా మొత్తంగా ఎంత మంది అయినా రూ.వంద పెట్టి టిక్కెట్ కొనుక్కోవచ్చు. అవి కోట్లలో ఉంటాయి. వాలంటీర్లతో కూడా కొనిపించే ప్లాన్ చేశారు.

ఈ లాటరీ టిక్కెట్ల వ్యవహారం విజయనగరంలో దుమారం రేపింది. ఇంతకు దిగజారిపోయిందేంటి అని ప్రభుత్వంపై అందరూ ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది. ముందుగా అందరూ బొత్స సత్యనారాయణపైనే అనుమానాపడ్డారు. దీంతో ఆయన తనకేం సంబంధం లేదని చెప్పుకునేందుకు అధికారులను మందలించినట్లుగా మీడియాకు సమాచారం ఇప్పించారు. అయితే రవాణాశాఖ అధికారులు ఉత్తి పుణ్యానే ఇలాంటి పనులు చేయరని పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చేసి ఉంటారని భావిస్తున్నారు.

మద్యం ఆదాయం రూ. ఆరు వేల కోట్ల నుంచి రూ. పాతిక వేల కోట్ల వరకూ పెంచుకున్నా ప్రభుత్వానికి మాత్రం సరిపోవడం లేదు. రకరకాల పన్నులు బాదేసినా చేసిన అప్పులకు వడ్డీలూ సరిపోవడం లేదు. ఏదో ఓ విధంగా ఆదాయం పెంచుకోవాలని తాపత్రయ పడుతోంది. దానికి లాటరీ టిక్కెట్లకు మించిన వ్యాపారం లేదని భావిస్తున్నట్లుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే విజయనగరంలో తేడా కొట్టడంతో ఈ విషయంలో ఎలాంటి వ్యూహం అమలు చేస్తారో చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close