లాటరీ టిక్కెట్ ట్రైల్ రన్ ఫెయిల్ !

ఏపీలో లాటరీ టిక్కెట్లు ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. గతంలో ఉన్నతాధికారులను లాటరీలు అమల్లో ఉన్న రాష్ట్రాలకు పంపి విధివిధానాలపై కసరత్తు చేసింది. అయితే ఇప్పటి వరకూ అమలు చేయలేదు. ఇప్పుడు కొత్తగా ఆ ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా విజయనగరం జిల్లాలో మూడు బైకుల లక్కీ డ్రాను రవాణాశాఖ అధికారులు ప్రారంభించారు. మూడు లక్షల పెట్టి మూడు బైకులు ఇస్తారు.కానీ జిల్లా మొత్తంగా ఎంత మంది అయినా రూ.వంద పెట్టి టిక్కెట్ కొనుక్కోవచ్చు. అవి కోట్లలో ఉంటాయి. వాలంటీర్లతో కూడా కొనిపించే ప్లాన్ చేశారు.

ఈ లాటరీ టిక్కెట్ల వ్యవహారం విజయనగరంలో దుమారం రేపింది. ఇంతకు దిగజారిపోయిందేంటి అని ప్రభుత్వంపై అందరూ ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది. ముందుగా అందరూ బొత్స సత్యనారాయణపైనే అనుమానాపడ్డారు. దీంతో ఆయన తనకేం సంబంధం లేదని చెప్పుకునేందుకు అధికారులను మందలించినట్లుగా మీడియాకు సమాచారం ఇప్పించారు. అయితే రవాణాశాఖ అధికారులు ఉత్తి పుణ్యానే ఇలాంటి పనులు చేయరని పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చేసి ఉంటారని భావిస్తున్నారు.

మద్యం ఆదాయం రూ. ఆరు వేల కోట్ల నుంచి రూ. పాతిక వేల కోట్ల వరకూ పెంచుకున్నా ప్రభుత్వానికి మాత్రం సరిపోవడం లేదు. రకరకాల పన్నులు బాదేసినా చేసిన అప్పులకు వడ్డీలూ సరిపోవడం లేదు. ఏదో ఓ విధంగా ఆదాయం పెంచుకోవాలని తాపత్రయ పడుతోంది. దానికి లాటరీ టిక్కెట్లకు మించిన వ్యాపారం లేదని భావిస్తున్నట్లుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే విజయనగరంలో తేడా కొట్టడంతో ఈ విషయంలో ఎలాంటి వ్యూహం అమలు చేస్తారో చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close