తెలుగు రాష్ట్రాలకు దండిగా నిధులిచ్చిన కేంద్రం..!

కరోనాపై పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడా నిర్లక్ష్యం చూపకుండా.. నిధుల సమస్య అనే మాట వినపడకుండా.. కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటోంది. గత ఆర్థిక సంతవత్సరం ముగింపు సందర్భంగా.. పధ్నాలుగో ఆర్థిక సంఘం నిధులతో పాటు.. పెండింగ్ నిధులన్నింటినీ రాష్ట్రాలకు ఇచ్చేసింది. తాజాగా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే కరోనాను ఎదుర్కొనేందుకు భారీగా నిధుల్ని విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. పదకొండు వేల కోట్లపైగానే ఈ నిధులు విడుదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక నిధులు లభించాయి. విపత్తు నివారణ కోసం ప్రత్యేకంగా ఏపీకి రూ.559.5 కోట్లు, తెలంగాణకు 224.5 కోట్లు విడుదల చేసింది కేంద్రం. ఇది మొదటి విడతేనని తెలిపింది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న కారణంగా క్వారంటైన్‌, శాంపిల్స్‌ సేకరణ, పరీక్షా కేంద్రాలు, సిబ్బంది కోసం.. నిధులను విడుదల చేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

అలాగే.. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు.. 14 రాష్ట్రాలకు రూ. 6,195 కోట్లను విడుదల చేసింది. లోటు ఉన్న రాష్ట్రాలకు ఈ మొత్తం పంచుతారు. ఏపీకి రూ.491.14 కోట్లు విడుదలయ్యాయి. తెలంగాణ లోటు ఉన్న రాష్ట్రం కాదు కాబట్టి.. ఎలాంటి సాయమూ లభించలేదు. మొత్తంగా.. ఏపీకి.. రూ. వెయ్యి కోట్ల వరకూ సాయం అందింది. తెలంగాణకు మాత్రం రూ. అందులో పావు వంతు మాత్రమే లభించింది. కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్నామంటూ కొన్ని రాష్ట్రాలు ప్రధానమంత్రికి మొరపెట్టుకున్నాయి.అదే సమయంలో.. కరోనాను ఎదుర్కొనే విషయంలో రాష్ట్రాలు సొంత ఖర్చులు ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా.,. మొత్తం కేంద్రమే… పెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

జాతీయ విపత్తుగా ప్రకటించారు కాబట్టి.. విపత్తు నిధి కింద మొత్తం.. కేంద్రమే భరించబోతోంది. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రాలకు ఆదాయం పడిపోయింది. దాన్ని కూడా భర్తీ చేయాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. ముందుగా కరోనాను తరిమికొట్టిన తర్వాత.. ఆర్థిక పరిస్థితులపై కేంద్రం దృష్టి సారించే అవకాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close