రైతుల పాదయాత్రకు ఇంత భయపడుతున్నారేంటి!?

వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు.. వంతెనలు , బ్రిడ్జిలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా జన సమీకరణ చేసేవారు. ఆ బ్రిడ్జి పట్టనంత జనం వచ్చారని డ్రోన్లతో షూట్ చేసుకుని సాక్షిలో గ్రాఫిక్స్ యాడ్ చేసి చూపించుకుని సంతోషపడేవారు . రాజమండ్రి వంతెనపైకి పాదయాత్ర వచ్చినప్పుడు వైసీపీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు రైతులు పాదయాత్ర చేస్తున్నారు. వారి పాదయాత్ర రాజమండ్రి దగ్గరకు వస్తుందనగానే… తమ పాదయాత్రను మించి జనం వస్తారని భయపడ్డారేమో కానీ.. వెంటనే మూసేస్తున్నట్లుగా ప్రకటించారు.

ఇన్నేళ్లుగా రాజమండ్రి రోడ్ కం రైలు వంతెన మరమ్మతులకు ప్రభుత్వం రూపాయి కేటాయించలేదు. ఇప్పుడూ కేటాయించ లేదు. కానీ హఠాత్తుగా మరమ్మతుల కోసం వారం రోజులు మూసేస్తున్నామంటూ కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వుల్ని చూసి అందరూ… రైతుల పాదయాత్ర అంటే ఇంత భయమేంటి అనుకుంటున్నారు. కొత్తగా మరమ్మతులకు ఎలాంటి నిధులు విడుదల కాకపోయినా.. పనులకు టెండర్లు పిలవకపోయినా మూసేశారు పనులు చేస్తారో లేదో తెలియదు కానీ.. బ్రిడ్జిని మాత్రం మూసేశారు. రైతుల పాదయాత్ర రాజమండ్రి దాటిన తర్వాత తెరుస్తారు.

అయితే ఇవన్నీ చిల్లర చేష్టలని వైసీపీ నేతలు కూడా అనుకుంటున్నారు. బ్రిడ్జిని మూసివేసినంత మాత్రాన రైతుల పాదయాత్ర ఆగిపోతుందా అని వారిలో వారు అనుకుంటున్నారు. ఇలాంటి పనులు చేయడం వల్ల ప్రజల్లో చులకన అవుతామని.. అంతకు మించిన రాజకీయ ప్రయోజనం ఉండదని… నిట్టూరుస్తున్నారు. అయితే వైసీపీ పెద్దల ఆలోచనా ధోరణి.. అంతే … కురచగా ఉంటుందని ఇప్పటికే అనేక సార్లు వెల్లడయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ముగ్గురూ ఒక్క‌డే!

తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అధిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'గుడ్ - బ్యాడ్ - అగ్లీ'...

నాగ‌శౌర్య‌కు ఏమైంది..?

టాలీవుడ్ లో హీరోలంతా య‌మా బిజీగా ఉన్న ద‌శ ఇది. చేతిలో ఒక‌టీ అరా విజ‌యాలు ఉన్న 'యావ‌రేజ్' హీరోలు సైతం.. త‌మ ఆధిప‌త్యం చూపిస్తున్నారు. చేతి నిండా సినిమాల‌తో హ‌డావుడి చేస్తున్నారు....

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close