సొంత ఎంపీ ఆరోపణల్ని ఖండించిన ఏపీ ప్రభుత్వం !

ఏపీలో ధాన్యం రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని తన వద్ద ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని.. సీఐడీ విచారణ చేయించాలని వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ సంచలన ఆరోపణలు చేశారు.కలెక్టర్‌ను కలిసి ఆధారాలు సమర్పించి సీఐడీ విచారణ కోరుతానని ప్రకటించిన బోస్ ఆ తర్వాత సైలెంటయ్యారు. పార్టీ హైకమాండ్ ఈ అంశంపై ఇక మాట్లాడవద్దని ఆదేశించడంతో ఆయన ఆగిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయన అలా ఫోన్ ఆపేసుకుని సైలెంటయిన వెంటనే అమరావతిలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు .. పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు ప్రెస్ మీట్ పెట్టారు.

పిల్లి సుభాష్ మాట్లాడింది స్కాం గురించి కాదన్నారు. బోస్ ఈకేవైసీలో జరుగుతోన్న జాప్యం గురించి మాత్రమే మాట్లాడారని కవర్ చేశారు. ఎంపీ చెప్పినట్లుగా అవతవకలు జరిగే ఆస్కారమే లేదని తేల్చేశారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్. నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలు నమోదు చేసి.. మిగతా రెండు ఎకరాలు వేరే వాళ్ల పేర్ల మీద నమోదు చేసే చాన్స్ లేదన్నారు.
తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని ఎంపీ బోస్ చెప్పినప్పటికీ..అధికారులు మాత్రం అలా జరిగే చాన్స్ లేదన్నారు.

అసలు ఏం జరిగిందో బోస్ నుంచి వివరాలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ సిద్దపడలేదు. స్కాం అనగానే.. ఎక్కడ బయటకు వస్తుందో అని టెన్షన్ పడి.. ఎంపీ నోరు మూయించేందుకు ప్రయత్నించారు కానీ.. ఆ సాక్ష్యాలేవో తీసుకుని స్కాంను బయట పెట్టి రైతుల్ని ఆదుకుందామన్న ఆలోచన చేయలేదు. ఆ స్కామేదో తామే చేస్తున్నట్లుగా.. మంత్రి , అధికారులు కంగారు పడిపోయి మీడియా ముందుకు కవరింగ్ చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. సొంత పార్టీ ఎంపీ చేసిన ఆరోపణపై విచారణ జరిపిస్తే ఏమవుతుందని సామాన్యులు కూడా భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close