పాత కలెక్టర్లు ప్రొబేషన్ ఇస్తారట – ఇదేం ఫిట్టింగ్ !?

గ్రామ, వార్డు సచివాలయ ప్రొబేషన్ల వ్యవహారాన్ని గందరగోళం చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే పరీక్షలు పేరుతో… ఓటీఎస్ సొమ్ముల పేరుతో సగం మందికి ప్రొబేషన్ కు అనర్హుల్ని చేసేసిన ప్రభుత్వం ఇప్పుడు అసలు ప్రొబేషన్ ఎవరు ఇవ్వాలన్నదానిపై లింకులు పెడుతోంది. జిల్లాల విభజన జరిగింది. ఇప్పుడు కొత్త జిల్లాలకు కలెక్టర్లు వచ్చారు. జిల్లాల కలెక్టర్లు ప్రొబేషన్ ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కానీ తాజాగామరోసారి ఆదేశాల్ని సవరించింది. పాత జిల్లాల కలెక్టర్లు ప్రొబేషన్ ఖరారు చేయాలని ఆదేశించింది.

అసలు పాత జిల్లాలు పూర్తిగా ఉనికి కోల్పోయిన తర్వాత ఇప్పుడు పాత జిల్లాల కలెక్టర్లకు అధికారం ఎలా ఉంటుందో ప్రభుత్వానికే తెలియాలి. వారు ప్రొబేషన్ ఖరారు చేస్తే. . ఎలా చట్టపరంగా సాధ్యమో ప్రభుత్వం చెప్పాల్సి ఉంది. అసలు కొత్త జిల్లాల ఉనికి వచ్చినప్పుడు .. పాత జిల్లాల ఉనికి లేనప్పుడు… ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం వెనుక మతలబేంటో మాత్రం ఎవరికీ అంతు చిక్కదు. అయితే కొత్త జిల్లాల వారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటే అనేక రకమైన చట్టపరమైన సమస్యలు వస్తాయని అందుకే పాత జిల్లాల వారీగా ప్రొబేష‌న్ ఖరారు చేస్తున్నారని చెబుతున్నారు. ఇవన్నీ ముందుగా ఆలోచించవద్దా.. చివరి క్షణంలో ఇలా చేస్తారా అన్న ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి.

పీఆర్సీ చర్చల సమయంలో జూన్‌లో ప్రొబేషన్ ఖరారు చేసి జూలై ఒకటో తేదీనుంచి రెగ్యులర్ పే స్కేల్ జీతం ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకూ ప్రొబేషన్ ఖరారు కాకపోవడంతో జూలై ఒకటో తేదీన పాత జీతమే అంటే పదిహేను వేలు మాత్రమే అందుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంతో అసలు ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్ని ప్రొబేషన్ చేసే ఉద్దేశం లేదని.. వారిని అలా వివాదాల్లో ఉంచే ప్రయత్నం చేస్తోందన్న అనుమానం వారిలో ప్రారంభమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close