రంగుల పట్టుదల..! అయిననూ సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్..!

హైకోర్టులో మూడు, నాలుగు సార్లు వ్యతిరేక తీర్పు వచ్చింది. ఓ సారి సుప్రీంకోర్టులోనూ చుక్కెదురు అయింది. అయినా సరే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇదంతా.. ప్రభుత్వ భవనాలపై రంగుల విషయంలోనే. ప్రభుత్వ భవనాలపై వైసీపీ రంగులు తొలగించకపోతే.. కోర్టు ధిక్కరణ ప్రక్రియ ప్రారంభించాలని… హైకోర్టు ఆదేశించింది. దానికి ఇరవై ఎనిమిదో తేదీ వరకే గడువు ఇచ్చింది. ఖచ్చితంగా ఒక్కరోజు ముందు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది ఏపీ సర్కార్. గతంలో హైకోర్టు.. సుప్రీంకోర్టు చెప్పినా రంగుల విషయంలో ఏపీ సర్కార్ వెనక్కి తగ్గలేదు. పాత వైసీపీ రంగులకు మరో రంగు కలిపి కొత్త జీవో ఇచ్చింది. ఇదంతా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని కోర్టు తేల్చింది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భవనాలన్నింటికీ వైసీపీ రంగులు వేశారు. దానిపై వివాదం చెలరేగింది. హైకోర్టు.. ప్రభుత్వ భవనాలపై పార్టీల రంగులు వేయకూడదని తీర్పు చెప్పింది. దానిపై ఓ సారి సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు కూడా.. హైకోర్టు తీర్పును సమర్ధించింది. అమలు చేయాలని ఆదేశించింది. అయితే ఏపీ సర్కార్ మాత్రం.. ఈ విషయంలో మొండి పట్టుదల ప్రదర్శిస్తోంది. ఆ రంగులు తీసి వేయకూడదన్న లక్ష్యంతో ఉంది. అందుకే.. కోర్టులు మొట్టికాయలు వేసినా.. ఏదో విధంగా పిటిషన్ల ద్వారా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

ప్రభుత్వం చట్ట విరుద్ధంగా ఉండే నిర్ణయాలు తీసుకోవడం.. వాటిపై కోర్టులు వ్యతిరేక తీర్పులు ఇస్తే.. న్యాయస్థానాలకూ దురుద్దేశాలు ఆపాదించి మాట్లాడటం… తరహా రాజకీయం ఇప్పుడు ఏపీలో ప్రారంభమయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. రంగుల విషయంలో కోర్టులు ఏ దశలోనూ చిన్న ఊరట కూడా ఇవ్వలేదు. అలా చేయడం నిబంధనలకు విరుద్ధమని.. ఉన్నతాధికారులుక తెలిసినా.. వారు ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఉత్తర్వులు ఇవ్వడం.. న్యాయపోరాటం చేయడం చేస్తున్నారు కానీ.. సరైన సలహాలను ప్రభుత్వ పెద్దలకు ఇవ్వలేకపోతున్నారంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close