కరోనా కట్టడి కోసం రంగంలోకి ఏపీ గవర్నర్ ..!

ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు నాలుగైదు వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్‌లో కరోనా రాని వారు ఎవరూ ఉండరనే ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం వైపు నుంచి పెద్దగా లేవనుకున్నారేమో కానీ.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. రంగంలోకి దిగారు. ఉన్నతాధికారులందరితో.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. మొత్తంగా వివరాలు తెలుసుకున్నారు. ఐదు జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయని.. గుర్తించి.. ఆయా జిల్లాల్లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు.

తెలంగాణలోనూ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదని అనుకున్నారేమో కానీ.. అక్కడి గవర్నర్ తమిళిసై యాక్టివ్ పార్ట్ తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ అధికారులు పెద్దగా సహకరించలేదు. దాంతో.. ఆమె సీరియస్‌గా సమీక్షలు చేయలేదు. అధఇకారులు.. గవర్నర్‌కే కాదు.. హైకోర్టు మాటలను కూడా వినడం లేదు. అయితే ఏపీలో మాత్రం.. చురుగ్గా టెస్టులు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. రోజుకు దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల టెస్టులు చేస్తున్నారు. తెలంగాణతో పోలిస్తే.. మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే.. కేసులు పెరుగుతూ ఉండటంతో.. గవర్నర్ సమీక్షించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

మరో వైపు ఏపీలో… మరణాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఇరవై నాలుగు గంటల్లో.. 62 మంది కరోనా కారణంగా చనిపోయారు. మొత్తం ఒక్క రోజులో పాజిటివ్ కేసులు 4944గా నమోదయ్యాయి. ప్రస్తుతం ఏపీలో 32336 యాక్టివ్ కే్సులు ఉన్నాయి. మొత్తం మరణాలు 758గా లెక్క తేలాయి. పరీక్షలు చేస్తున్నప్పటికీ.. కట్టడి చర్యలు పెద్దగా లేకపోవడమే… కరోనా కేసులు పెరిగిపోవడానికి కారణం అన్న అంచనాలు ఏర్పడుతున్నాయి. కొన్ని చోట్ల అధికారయంత్రాంగం.. లాక్ డౌన్ లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నా… మద్యం షాపులు.. ఇతర వాటికి యథేచ్చగా అనుమతించడంతో వాటి వల్ల ఉపయోగం ఉండటం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close