కరోనా సాకులు – చేతులెత్తేసిన ఏపీ ప్రభుత్వం !

ఏపీ ప్రభుత్వం తనకు చేత కావడం లేదని నేరుగానే చెబుతోంది. అయితే దానికి కరోనా కారణంగా చెబుతోంది. ఏపీ ప్రభుత్వం ప్రతి ఆర్థిక సమస్యకూ కరోనా కారణంగా చెబుతోంది. ఉద్యోగులకు సమయానికి జీతాలు ఎందుకివ్వడం లేదంటే కరోనా అంటోంది. బిల్లులు ఎందుకు చెల్లించడం లేదంటే కరోనా అంటోంది. రాష్ట్రాన్ని ఒక్క అభివృద్ధి పని ఎందుకు చేయడం లేదంటే విభజన సమస్యలు అంటున్నారు. ఇలా ప్రతీ దానికి సాకులు చెబుతూ..మది చేతకాని ప్రభుత్వమని.. చేవ చచ్చిన ప్రభుత్వమని.. ఏమీ చేయలేమని నేరుగా సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటున్న వైనం ఇప్పుడు అందర్నీ నివ్వెర పరుస్తోంది.

కరోనా ఒక్క ఏపీకే వచ్చిందా ?

కరోనా అనేది ప్రపంచం అంతా వచ్చింది. ప్రజలకూ వచ్చింది. ప్రభుత్వాలకు లెక్కలకు మిక్కిలిగా అప్పులు చేసుకునే అవకాశం లభించింది. ఆ ప్రకారం తీసుకున్నారు. బయటపడ్డారు. ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో పడిన వాళ్లకే తెలుసు. అప్పులతో కాలం గడిపేసిన ప్రభుత్వానికేం కష్టం లేదు. కానీ ఇప్పుడు సామాన్య ప్రజలకు లేని చాయిస్.. ప్రభుత్వానికి వచ్చింది. నీకేమి చేతకావడం లేదెందుకు అంటే… కరోనా కారణం అనే వెసులుబాటులభించింది. దాన్ని విపరీతంగా వాడేస్తున్నారు. ఒక్క ఏపీకేనా తెలంగాణకు లేదా… తమిళనాడుకు లేదా.. మొత్తం ప్రపంచానికి కరోనా లేదా.. అంటే.. సమాధానం ఉండదు. అందరికీ పాండమిక్ వచ్చింది .. కానీ తమ చేతకాని తనానికి అసమర్థతకు.. దాన్ని కారణంగా చూపించడం లేదు. ఒక్క ఏపీలోనే అలా చూపిస్తున్నారు.

విభజన జరిగిన ఐదేళ్లు లేని కష్టాలు ఇప్పుడెందుకు. వస్తున్నాయి ?

ఏదైనా కారణం చెబితే అతికినట్లు ఉండాలి. విభజన సమస్యల వల్లకూడా తాము అభివృద్ధి చెందలేకపోతున్నామని జీతాలివ్వలేకపోతున్నామని చెబితే.. వింతగా ఉంటుంది. ఎందుకంటే ఏపీ విడిపోయిన ఐదేళ్ల వరకూ ఓ ప్రభుత్వం నడిచింది. ఆ ప్రభుత్వం పన్నులేయలేదు. పాలన సజావుగా నడిచింది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు పెరిగాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఏపీలో దరిద్రం రాజ్యమేలడానికి విభజనే కారణం అని చెబితే.. ఎంత కామెడీగా ఉంటుంది. అయినా చెబుతున్నారు. విభజన కన్నా ఎక్కువగా తమ నిర్ణయాలు, పాలన … దారుణంగా దెబ్బకొట్టిందని కవర్ చేసుకోవడానికి విభజన కష్టాలంటున్నారు.

చేతకాని.. చేవ చచ్చిన పాలన చేస్తున్నట్లుగా నేరుగా ఒప్పుకుంటున్నారా ?

నాలుగేళ్లుగా ఒక్క పనీ చేయలేదు. పోలవరం ఆగిపోయింది. అమరావతిని చంపేశారు. రాష్ట్రంలో ఒక్క రోడ్డు బాగోలేదు. ఏపీలో అక్రమ ఇసుక, జూదం, అక్రమ మద్యం వ్యాపారాలు మినహా మరే వ్యాపారమూ సవ్యంగా సాగడం లేదు. తాగుబోతుల దగ్గర్నుంచి ఏటా రూ. 30వేల కోట్లు పిండేస్తున్నారు. కానీ ఉద్యోగులకు జీతాలివ్వడం లేదు… బిల్లులు చెల్లించడం లేదు.. ప్రతీ వర్గం రోడ్డెక్కే పరిస్థితి. వీటన్నింటినీ పరిష్కరించలేక.. కరోనా, విభజన సమస్యలు అని కారణం చెప్పి.. తమకు చేతకాదని నిరూపించుకుంటున్న ప్రభుత్వం.. నిజంగా ఏపీ ప్రజల దురదృష్టమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close