మూడు రాజధానులపై హైకోర్టు స్టేటస్ కో ..!

పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లుల ఆమోదం, గెజిట్ విడుదలపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కౌంటర్‌ దాఖలుకు 10 రోజుల సమయం కోరిన ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. దానికి అంగీకరించిన కోర్టు… అప్పటి వరకూ..స్టేటస్ కో అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ నెల 14వ తేదీకి కేసు విచారణ వాయిదా వేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుల ఆమోదం బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరుపు న్యాయవాదులు వాదించారు. దీనిపై ప్రభుత్వం రిప్లై కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ బిల్లులపై యథాతథ స్థితి కొనసాగించడం అంటే.. ఆ బిల్లుల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. అంటే.. హైకోర్టులో విచారణ పూర్తయ్యే వరకూ…, ఆ బిల్లుల ఆధారంగా… రాజధాని తరలించడం సాధ్యం కాదు.

మండలిలో సెలక్ట్ కమిటీలో ఉన్న బిల్లుల్నే ప్రభుత్వం మళ్లీ అసెంబ్లీలోపెట్టి ఆమోదింప చేసుకుని చట్ట రూపంలోకి తీసుకు వచ్చిందని… ఇది రాజ్యాంగ విరుద్దమని.. విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. న్యాయనిపుణులు కూడా అదే చెబుతున్నారు. మూడురాజధానులు అనేది… విభజన చట్టాన్ని అధిగమించేలా ఉందని.. హైకోర్టు ఎక్కడ ఉండాలో చెప్పే అధికారం ప్రభుత్వానికి.. లేదని.. ఆ అంశంపై చట్టం చేయలేరని అంటున్నారు. ఈ అభ్యంతరాలు అన్నీ వివరిస్తూ.. హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.

గవర్నర్ ఆమోదించినా… ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినా… న్యాయసమీక్షకు లోబడే ఉంటాయని.. న్యాయనిపుణులు చెబుతున్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించేదిగా ఉంటే… చట్టాలను సైతం.. కొట్టి వేసే హక్కు కోర్టులకు ఉందని వాదిస్తున్నారు. ఇప్పుడు… మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాలు న్యాయసమీక్షకు వెళ్లాయి. దీనిపై హైకోర్టు విచారణ ఆసక్తి రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close