అది ఆ నోటీసు కాదుట!

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణా హోం కార్యదర్శి రాజీవ్ త్రివేదికి ఆంద్రప్రదేశ్ సిట్ అధికారులు నోటీసు ఇవ్వబోతున్నారు అని నిన్న వార్తలు వచ్చాయి. ఆయనకి నోటీసు ఇచ్చారు, కానీ అది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనని విచారించేందుకు కాదు. ఆయన వద్ద ఉన్న కాల్-డాటా రికార్డులను జాగ్రత్తగా భద్రపరచమని కోరుతూ విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆయనకు అందించదానికి మాత్రమే. సిట్ అధికారులు కోర్టు ద్వారా పొందిన ఆ ఆదేశాన్ని నిన్న సాయంత్రం ఆయనకు అందించి తిరిగి వచ్చేసారు. అంతే!కానీ ఆయనకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వబోతున్నారు అంటూ సంబంధిత అధికారులు సగం నిజం దాచిపెట్టి మీడియాకి ఇచ్చిన లీక్ వలన ఆయనను విచారించేందుకే నోటీసు ఇవ్వబోతున్నారు అని మీడియాలో ప్రచారం అయ్యేలా చేయగలిగారు. ఎసిబి అధికారులు తెదేపాతో సంబంధం ఉన్నవారిని ఎవరినో ఒకరిని ఎంచుకొని ఓటుకి నోటు కేసులో నోటీసులు ఇస్తూ తెదేపా నేతల్లోఏవిధంగా గుబులు పుట్టించే ప్రయత్నం చేస్తున్నారో, ఏపి సిట్ అధికారులు కూడా ఈవిధంగా ఒకసారి టీ-న్యూస్ ఛానల్ కార్యాలయానికి, ఇంకోసారి మంత్రి కేటీఆర్ ఇంటికి మళ్ళీ ఇప్పుడు ఏకంగా తెలంగాణా హోంశాఖ కార్యదర్శి వద్దకు వెళ్ళడం ద్వారా తెరాస నేతలకు కూడా గుబులు పుట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.కానీ తెదేపా, తెరాస ప్రభుత్వాలు రెండూ కూడా ఈ కేసుల్లో అడుగుముందుకు వేయలేవని ప్రజలకు కూడా ఇప్పుడు అర్ధం అయ్యింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆహా ఒరిజినల్ సిరీస్ ‘పాపం పసివాడు’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన డైరెక్టర్ సందీప్ రాజ్ … సెప్టెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్

పాపులర్ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఆహా నుంచి ‘పాపం పసివాడు’*అనే కామెడీ వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకులను పలకరించుంది. ఈ ఒరిజినల్‌ను *వీకెండ్...

టీడీపీ, జనసేన క్యాడర్ సమన్వయ బాధ్యతలు తీసుకున్న నాగబాబు

టీడీపీ, జనసేన పొత్తు ఖరారు కావడంతో ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా కలిసి పోటీ చేసేందుకు ఓట్ల బదిలీ సాఫీగా జరిగేందుకు..క్యాడర్ మధ్య సమన్వయం సాధించే బాధ్యతను మెగా బ్రదర్ నాగబాబు తీసుకున్నారు....

లండన్‌లో జగన్ రెడ్డి ఫ్యామిలీకీ ఏపీ ప్రజల ఖర్చుతోనే సెక్యూరిటీ

ఏపీ ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త చట్టం తీసుకువస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టింది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన...

లింగుస్వామికి ఓ హీరో కావాలి

‘పందెంకోడి’, ‘ఆవారా’ వంటి చిత్రాలతో తెలుగువారికి సుపరిచితులైన దర్శకుడు లింగుస్వామి. ఇటీవల రామ్‌తో ‘ది వారియర్‌’ తీశాడు. ఈ సినిమా పరాజయం పాలైయింది. ఇప్పుడు మళ్ళీ ఓ తెలుగు హీరోతోనే సినిమా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close