మోడీ చైనాకి దూరం జరుగుతుంటే…బాబు దగ్గరకి జరుగుతున్నారేమిటో?

ఒక దేశంతో యుద్ధం చేస్తూ అదేసమయంలో దానితో యధాప్రకారం స్నేహ సంబందాలు కూడా కొనసాగించవచ్చా? అంటే సాధ్యం కాదనే చెప్పవచ్చును. ఎప్పుడూ సందిగ్ధావస్థలో కొనసాగే భారత్-పాక్ సంబంధాలే అందుకు ఒక చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చును. అవి కొంతకాలం సజావుగా ఎక్కువ కాలం ఒడిదుడుకులతో కొనసాగుతుండటం చూస్తూనే ఉన్నాము.

చైనాతో కూడా అటువంటే పరిస్థితులే నెలకొని ఉన్నప్పటికీ పాకిస్తాన్ తో పోలిస్తే ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు కాంత్ సజావుగానే సాగుతున్నట్లు కనిపిస్తున్నాయి. కానీ ఇటీవల పఠాన్ కోట్ పై దాడులకు కుట్ర పన్నిన జైష్-ఏ-మహమ్మద్ అధినేత మసూద్ అజహర్ పై నిషేధం విధించాలనే భారత ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి ఆమోదించబోతున్న తరుణంలో చైనా తనకున్న ‘వీటో పవర్’ ని ఉపయోగించి అడ్డుపడింది.

అసలు మసూద్ అజహర్ వ్యవహారంతో చైనాకి ఎటువంటి సంబంధమూ లేనప్పటికీ పాక్ అభ్యర్ధన మేరకే భారత్ ప్రతిపాదనకి గండి కొట్టింది. అందుకు భారత్ ప్రజలు కూడా చైనాపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ పరిణామాలపై సామాజిక మాధ్యమాలలో వస్తున్న కామెంట్లు చూసినట్లయితే ఆ విషయం అర్ధం అవుతుంది. భారత్ పై దాడులకు కుట్రలు పన్నిన ఉగ్రవదికి మద్దతు ఇచ్చినందుకు నిరసనగా చైనా వస్తువులను బహిష్కరించాలని గట్టిగా ప్రచారం జరుగుతోంది. మోడీ ప్రభుత్వం కూడా చైనాకి గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశ్యంతో భారత్ లోకి చైనా వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విదించాలని ఆలోచిస్తున్నట్లు తాజా సమాచారం.

సరిగ్గా ఇటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న చైనా సిచువాన ప్రావిన్స్ తో వివిధ రంగాలలో సహాయ సహకారాల కోసం ఒక ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. ఉగాది సందర్భంగా నిన్న విజయవాడలోని మురళీ ఫార్ట్యూన్ హోటల్ ల్లో రాష్ట్ర ప్రభుత్వం, చైనా ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసారు.

సాధారణ పరిస్థితులలో అయితే ఇది చాలా సర్వసాధారణమయిన విషయంగానే భావించవచ్చును. కానీ భారత్ వ్యతిరేక శక్తులకు బహిరంగా మద్దతునిస్తున్న చైనా పట్ల కేంద్రప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పుడు, ఒక రాష్ట్ర ప్రభుత్వం దానితో ఈవిధంగా ఒప్పందం చేసుకోవడం సమంజసమేనా? అనే సందేహం కలుగుతుంది.

రాజధాని మాష్టర్ ప్లాన్, నిర్మాణ విషయంలో కేంద్రప్రభుత్వంతో ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్, జపాన్ దేశాలతో, సంస్థలతో ఒప్పందాలు ఖరారు చేసుకొన్నందుదుకు ప్రధాని నరేంద్ర మోడి ఆగ్రహంగా ఉన్నారని, అందుకే అమరావతి శంఖుస్థాపన సమయంలో రాజధాని నిర్మాణానికి ఎటువంటి భారీ నిధులు ప్రకటించకుండా కేవలం గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్ళు చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టి వెళ్లిపోయారని ఆ మాధ్యన వార్తలు వచ్చేయి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చైనాతో ఒప్పందపత్రాలపై సంతకాలు చేస్తే ప్రధాని నరేంద్ర మోడి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close