బాధితులే లేని కేసులో ఐదుగుర్ని అరెస్ట్ చేసిన ఏపీసీఐడీ !

అమరావతి రైతులు అలా పాదయాత్ర ప్రారంభించగానే ఇలా ప్రభుత్వం కుట్రల మీద కుట్రలు ప్రారంభించింది. ఓ వైపు ఉత్తరాంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తూ.. మరో వైపు షెడ్డుకెళ్లిపోయిన కేసుల్లో కొంత మందిని అరెస్ట్ చేస్తోంది. మరో వైపు కార్పొరేషన్ ప్రజాభిప్రాయసేకరణ అంటూ హడావుడి చేస్తున్నారు. రాజధాని అసైన్డ్ భూముల్లో అక్రమాలని ఎమ్మెల్యే ఆళ్ల రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసిన పోలీసులకు.. తము బాధితులమంటూ ఒక్కరు కూడా రాలేదు. అయినా సరే విచారణ జరిపి ఇప్పుడు ఐదుగుర్ని అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు.

అసలు తమ భూములు తమ దగ్గరే ఉన్నాయని ఎవరికీ అమ్మలేదని ఆ దళిత రైతులు చెబుతున్నారు. కానీ సీఐడీ అధికారులు మాత్రం మీరు నారాయణ … బినామీలకు అమ్మేశారని తేల్చేసి కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనుకున్న వాళ్లని చేసేశారు. పదకొండు వంద ఎకరాల అసైన్డ్ భూములు చేతులు మారాయని సీఐడీ అధికారులు చెబుతున్నారు. కానీ ఎక్కడా అలాంటి లావాదేవీలు లేవని గతంలోనే తేలింది. అయితే ఇప్పుడు కొత్తగా సీఐడీ అధికారులు అరెస్టులు చేసి కొత్తగా ఏదో చేసేశామని ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు.

ఇంత ప్రభుత్వ యంత్రాంగం ఉన్నా.. పోలీసులు, సీఐడీ వచ్చి వేధిస్తున్నా ఒక్క దళిత రైతు కూడా తమ భూములు అక్రమంగా లాక్కున్నారని చెప్పడం లేదని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వారు కూడా తాము ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని … వారి వీడియోలను టీడీపీ అప్పట్లోనే టీడీపీ విడుదల చేసింది. కక్షతో కళ్లు మూసుకుపోయిన ప్రభుత్వం సీఐడీ లాంటి వ్యవస్థల్ని ఉపయోగించకుని నేరాలకు పాల్పడుతోందని ఎప్పటికైనా పాపం పండక తప్పదని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నామా కేంద్ర మంత్రి – కాంగ్రెస్ కూటమి సర్కార్‌లోనా ?

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎవరితో ఉంటారో ఇంకా ప్రకటించలేదు ..కానీ ఆయన మాత్రం ఓ ప్లాన్ తో ఉన్నారు. నామా నాగేశ్వరరరావును కేంద్ర మంత్రిని చేయాలనుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీకి...

మరోసారి అభాసుపాలైన హరీష్ ..!!

సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల వరుస సవాళ్ళు విసిరి నవ్వులపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావు మరోసారి అభాసుపాలు అయ్యారు. రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీ పోలీసులు నోటిసులు ఇచ్చారని, ఆలస్యం చేయకుండా రేవంత్...

ఓటేస్తున్నారా ? : పోలవరం వైపు ఓ సారి చూడండి !

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కరువులో నిండా మునిగిపోవాలో.. కనీసం రైతుల కడుపు నింపుకోవాలో తేల్చుకోవాల్సిన సంధి స్థితిలో ఉంది. ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధమయ్యారు. గతంలో ఓట్లు వేశారు. ఐదేళ్లలో ఏం...

ఏది నైతికత… ఏది అనైతికత ..!?

రిజర్వేషన్లపై అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీంకు నోటిసులు జారీ చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ల విషయంలో తమపై అభాండాలు వేస్తున్నారని గగ్గోలు పెడుతోన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close