“అప్పడం వ్యాక్సిన్” కనిపెట్టిన కేంద్రమంత్రికే కరోనా..!

కరోనా వైరస్‌కు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల దగ్గర్నుంచి భారతీయ జనతా పార్టీ నేతల వరకూ..అందరూ.. మందు కనిపెట్టే పనిలో బిజీగా ఉన్నారు. సైంటిస్టులు ఇంకా కుస్తీలు పడుతున్నారు కానీ.. భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం.. చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. ఒకరు హనుమాన్ చాలీసా చదవాలంటారు.. మరొకరు గోమూత్రం తాగాలంటారు.. ఇంకొకాయన .. కరోనాను తరిమికొట్టే అప్పడాలు అంటూ… రిలీజ్ చేసేశారు. ఆ అప్పడాలు తింటే కరోనా పారిపోతుందని కూడా సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. వీరందరూ సాదాసీదా బీజేపీ కార్యకర్తలు కాదు.. ఎంపీలు.. కేంద్రమంత్రులు. ఇలా కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌ “అప్పడం వ్యాక్సిన్‌”ను కొద్ది రోజుల కిందట విడుదల చేశారు. ఓ అప్పడంను చటుక్కున విరుచుకుని తిని.. ఇక తనకు కరోనా రాదన్నట్లుగా కలరింగ్ ఇచ్చారు.

ఆయన కరోనా అప్పడాల అమ్మకాలు పెరిగాయో లేదో కానీ… ఇప్పుడు ఆయనకే కరోనా పాజిటివ్ వచ్చిందని తేలింది. కరోనా లక్షణాలు కనిపించటంతో ఆయన టెస్ట్ చేయించుకున్నారు. పాజిటివ్ రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. తనని కాంటాక్ట్ అయిన వారంతా టెస్టులు చేయించుకోవాలని మంత్రి సూచించారు. ఈ విషయం బయటకు తెలిసిన వెంటనే.. సహజంగానే ఆయనపై సెటైర్లు ప్రారంభమవుతాయి. అయ్యాయి కూడా. సోషల్ మీడియాలో ఇప్పుడీ అప్పడాల మంత్రి ట్రెండింగ్.

కరోనాను మార్కెట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. ప్రజల్ని భయపెట్టి.. తమ వస్తువులు వాడితే… కరోనాను తరిమికొట్టవచ్చని ప్రోత్సహిస్తున్నారు. చివరికి… పతంజలి బాబా రామ్ దేవ్ కూడా.. ఈ వ్యాపారంలోకి వచ్చారు. పెద్ద ఎత్తున కరోనిల్ అమ్ముతున్నామని చెబుతున్నారు. ఇదేదో బాగుందని బీజేపీ నేతలు… అప్పడాల దాకా వచ్చేశారు. అది వారితో.. వారికి సంబంధించిన వారిదో కానీ మార్కెటింగ్ కోసం.. తమ తెలివితేటలనంతా ప్రదర్శించేసి.. నవ్వుల పాలవుతున్నారు. అంతకూ.. ఆయన ప్రపంచానికి పరియచం చేసిన కరోనా అప్పడాల బ్రాండ్ ఏమిటో తెలుసా..” బాబ్జీ”

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close