బాహుబ‌లి టీమ్‌కి భారీ న‌జ‌రానా

బాహుబ‌లి.. సినిమా కాదు, ఓ బ్రాండ్‌గా మారింది.తొలి భాగం రూ.600 కోట్లు సాధిస్తే, రెండో భాగం వెయ్యి కోట్లు అవ‌లీల‌గా అందుకొంటుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు క‌డుతున్నాయి. ఈ స్థాయి విజ‌యం అందుకొంటుంద‌ని రాజ‌మౌళితో స‌హా ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. అద్భుతాలంతే. ప్లాన్ ప్ర‌కారం జ‌ర‌గ‌వు. అయితే… ఈ విజ‌యం వెనుక టీమ్ ప‌డిన క‌ష్టం అంతా ఇంతా కాదు. రాజ‌మౌళి ఒక్క‌డే కాదు. ప్ర‌భాస్‌, అనుష్క‌, కీర‌వాణి, సెంథిల్‌.. ఇలా ప్ర‌తీ న‌టుడూ, సాంకేతిక నిపుణుడూ త‌న కెరీర్‌లో విలువైన ఐదేళ్ల కాలం ఈ సినిమాకి అర్పించారు. వాళ్ల‌క‌ష్టాన్నిపారితోషికాల‌తో లెక్క‌గ‌ట్ట‌లేం. ఆ మాట‌కొస్తే ఎంతిచ్చినా త‌క్కువే. ఇప్ప‌టికే ప్ర‌భాస్‌, రానాలు ఈ సినిమా ద్వారా త‌మ కెరీర్‌లోనే అత్య‌ధిక పారితోషికాలు అందుకొన్నారు. రాజ‌మౌళి రెమ్యున‌రేష‌న్ చెబితే దిమ్మ‌తిరిగిపోవ‌డం ఖాయం. అయితే.. వీటితో స‌రిపెట్ట‌కుండా ఆర్కా మీడియా.. బాహుబలి టీమ్‌కి ప్ర‌త్యేక న‌జ‌రానాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకొంద‌ని స‌మాచారం.

బాహుబ‌లి 2 విడుద‌లై… నిజంగానే అంద‌రి అంచ‌నాల ప్ర‌కారం రూ.1000 కోట్లు సాధిస్తే ఆ న‌జ‌రానాలు భారీ స్థాయిలో ఉండ‌బోతున్నాయ‌ని, లేక‌పోతే… ఆక‌ర్ష‌ణీయ‌మైన బ‌హుమానాల‌తో స‌రిపెడ‌తార‌ని తెలుస్తోంది. మొత్తానికి బాహుబ‌లి టీమ్‌కి ఊహించ‌ని గిఫ్ట్ లు ల‌భించ‌డం ఖాయం. వాటి ఖ‌రీదు ఎంత‌న్న‌ది… బాహుబ‌లి 2 తీసుకొచ్చే వ‌సూళ్ల‌ని బ‌ట్టి ఉంద‌న్న‌మాట‌. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణ‌ల‌కే కాదు.. ఈ సినిమాకి తెర వెనుక ఉండి ప‌నిచేసిన అంద‌రికీ ఏదో ఓ రూపంలో బ‌హుమానం అందివ్వాల‌ని ఆర్కా మీడియా భావిస్తోంద‌ట‌. క‌ష్టాన్ని గుర్తించ‌డం ఎప్పుడూ శుభ‌ప‌రిణామ‌మే క‌దా..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close