కేజ్రీవాల్ కి నోటీసులు ఇవ్వాలా వద్దా…

ఒకప్పుడు డిల్లీ మరియు డిస్ట్రిక్ట్ క్రికెట్ బోర్డుకి అధ్యక్షుడుగా ఉన్న కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, స్టేడియం నిర్మాణం పేరిట భారీగా నిధులను స్వాహా చేసారంటూ డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. దానికి ఆగ్రహించిన అరుణ్ జైట్లీ తనపై నిరాధారమయిన ఆరోపణలు చేసి తన పరువు ప్రతిష్టలకి భంగం కలిగించారని ఆరోపిస్తూ అరవింద్ కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేశారు. అరవింద్ కేజ్రీవాల్ తో బాటు ఆమాద్మీ పార్టీ నేతలు కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ చద్ద, దీపక్ బాజ్ పేయిలపై కూడా జైట్లీ దావా వేశారు.

దానిని ఈరోజు విచారణకు స్వీకరించిన డిల్లీ న్యాయస్థానం ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ని ఈ కేసులో విచారణ నిమిత్తం వ్యక్తిగతంగా కోర్టుకి రమ్మని నోటీసు ఇవ్వాలా వద్దా అనే దానిపై మార్చి 9వ తేదీన తమ నిర్ణయం తెలుపుతామని ప్రకటించింది.

తనపై అరుణ్ జైట్లీ పరువు నష్టం దావా వేయడాన్ని అరవింద్ కేజ్రీవాల్ కూడా స్వాగతించారు. జైట్లీపై తను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని కూడా చెప్పారు కానీ ఆయన ఇంతవరకు తన ఆరోపణలను నిరూపించే ఆధారాలేవీ సమకూర్చుకొన్నట్లు లేదు. దీనిపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించేందుకు ఆయన ఏక సభ్య కమిటీని నియమించారు కానీ దాని నివేదికలోను అరుణ్ జైట్లీ బోర్డు అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడినట్లుగా ఎటువంటి ఆధారాలను చూపలేకపోయింది. కనుక అరుణ్ జైట్లీపై చేసిన ఆరోపణలని నిరూపించేందుకు అరవింద్ కేజ్రీవాల్ తప్పనిసరిగా కోర్టుకి తగిన సాక్ష్యాధారాలు నిరూపించాల్సి ఉంటుంది. లేకుంటే ఈ పరువు నష్టం కేసులో అరుణ్ జైట్లీకి కోటి రూపాయలు చెల్లించుకోవలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కేకే , కడియం..!!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా కేసీఆర్ సన్నిహిత నేతలు కూడా హస్తం గూటికి చేరేందుకు...

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close