జగన్ రెడ్డి చెప్పిందే – ఇక నుంచి చేసే శంకుస్థాపనలన్నీ పచ్చి మోసాలే !

ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే దాన్ని మోసమంటారు అని జగన్ రెడ్డి తన పదవీ ప్రమాణం చేసిన ఆరు నెలల తర్వాత కడపలో స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసి వ్యాఖ్యానించారు. తన పాలన ఏదో… అక్కడే ఆగిపోతుదంని..తన పాలనకూ చివరి ఆరు నెలలు రావని… ఆ సమయంలో తాను శంకుస్థాపనలు ఏవీ చేయనని ఆయన అనుకున్నారో లేకపోతే… ఆ ప్పటి సంగతి అప్పుడు చూసుకుందామని రెచ్చిపోయారో కానీ.. ఇప్పుడు ఆ మాటలన్నీ ఆయనకే వస్తున్నాయి.

జగన్ రెడ్డి పాలన చివరికి వచ్చింది. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకూ జగన్ రెడ్డి తాను కామెంట్స్ చేసి శంకుస్థాపన చేసిన స్టీల్ ప్లాంట్ కు మరోసారి శంకుస్థాపన చేశారు కానీ కట్టిందేమీ లేదు. కనీసం ప్రహరీగోడ కూడా కట్టుకోలేదు . భూములు మాత్రం కట్టబెట్టారు. కానీ ఇప్పుడు పోలోమంటూ శంకుస్థాపనలకు బయలుదేరారు. గత ప్రభుత్వం మాచర్లలో పరికశలపూడి ప్రాజెక్టుకు పాలనామోదం ఇచ్చింది. రూ. నాలుగు వందల కోట్లను మంజూరు చేసింది. ఐదేళ్ల పాటు దాన్నిప క్కన పెట్టేసిన జగన్ రెడ్డి ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేయడానికి బయలుదేరాడు. ఉత్తుత్తి టెంకాయ కొట్టి ప్రజల్ని మోసం చేయడానికి రెడీ అయ్యారు.

ఇక నుంచి జగన్ రెడ్డి చేసే ప్రతి శంకుస్థాపన పచ్చి మోసమే. ఆయన చెప్పిన దాని ప్రకారం ఎన్నికలకు ఆరు నెలలముందు నుంచే శంకుస్థాపనలు ఆపేయాలి. కానీ నాలుగు నెలల ముందు స్టార్ట్ చేస్తున్నాడు జగన్ రెడ్డి. ఈ ఐదేళ్లలో జీవనాడి అయిన పోలవరాన్ని పడుకోబెట్టేశాడు. శరవేగంగా పనులు జరుగుతున్న సమయంలో బినామీకి కాంట్రాక్ట్ ఇచ్చేందుకు రివర్స్ టెండర్లేసి.. మొత్తానికి మోసం తెచ్చాడు. ఐదేళ్ల పాటు పోలవరం పనులు ఆగిపోయాయి. అదొక్కటే కాదు.. ఏపీలో ఒక్క ప్రాజెక్టుకూ నిధులుకేటాయించలేదు.. పూర్తి చేయలేదు. శంకుస్థాపనలకు బయలుదేరాడు. నమ్మేవాడుంటే… ఇదిగో రేపే కట్టేస్తానని చెప్పేస్తాడు జగన్ రెడ్డి., తనను నమ్మేవాళ్లంటే.. అంత అలుసు మరి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close