మాన్సాస్ ట్రస్ట్ .. కోర్టులకెక్కక తప్పదు..!

మాన్సాస్ ట్రస్ట్‌ను ఇతర మతం వారికి అప్పగించడం మంచి పద్దతి కాదని… దీని వల్ల సమస్యలు వస్తాయని.. ప్రభుత్వం తీసేసిన మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు స్పష్టం చేశారు. అశోక్ గజపతిరాజు వైద్య పరీక్షల కోసం ఢిల్లీలో ఉన్న సమయంలో హడావుడిగా… రహస్య జీవో ఇచ్చిన ప్రభుత్వం.. రాత్రికి రాత్రి ఆయనను తొలగించి.. ఆయన అన్న కుమార్తె సంచైతను చైర్‌పర్సన్‌గా ప్రమాణస్వీకారం చేయించింది. అదే విధంగా సింహాచలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవి కూడా ఇచ్చింది. మాన్సాస్ ట్రస్ట్ పరిధిలో 105 ఆలయాలు ఉండటం… ట్రస్ట్‌కు రూ. లక్షా 30వేల కోట్ల విలువైన భూములు ఉండటంతో ఈ వ్యవహారం వివాదాస్పదమయింది. దీనిపై అశోక్ గజపతిరాజు స్పందనేమిటన్నదానిపై ఆసక్తి నెలకొంది. వైద్య పరీక్షల తర్వాత ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన అశోక్‌గజపతిరాజు.. కోటలో మీడియా సమావేశం పెట్టారు.

సంచయిత వేర మతం అనే అంశాన్ని అశోక్ గజపతిరాజు బయటపెట్టారు. సంచైత.. వాటికన్ సిటీకి వెళ్లి క్రీస్తు ప్రార్థనల్లో పాల్గొనడం.. క్రిస్మస్‌ను వేడుకగా జరుపుకోవడం వంటివి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సంచయితతో పాటు ఆమె తల్లి కూడా క్రిస్టియానిటీనే అనుసరిస్తారని.. అశోక్ నేరుగా చెప్పినట్లయింది. మిస్టర్ కూల్ అశోక్ గజపతిరాజు.. తాజా పరిణామాలపై .. ఏ మాత్రం ఆవేశ పడతారు. ఆయన తనదైన పద్దతిలోనే సమాధానం చెప్పారు. ప్రభుత్వం జీవో ఇచ్చి… సంచైతకు… పదవి అప్పగించిందని.. ఆ జీవో ఎంటో తనకు ఇంత వరకూ అందలేదన్నారు. అంత రహస్యంగా జీవో ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అది అందినత తర్వాత న్యాయపోరాటం చేస్తామన్నారు. అసలు చైర్మన్‌గా తనను తీసేయడానికి తాను చేసిన తప్పేమిటో చెప్పాల్సి ఉందన్నారు. ప్రభుత్వ తీరు వింతగా ఉందన్నారు. ఇలాంటి వ్యవహారాల వల్లే రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు, ప్రాజెక్టులు రావడం లేదన్నారు. పిల్లల భవిష్యత్ కోసమే ఆ ట్రస్ట్ ఏర్పాటు చేశారని చెప్పిన అశోక్ గజపతిరాజు.. సంచైత .. ఎలా న్యాయ చేయగలరని ప్రశ్నించారు.

ట్రస్ట్ భూములపై ఇతరులు కన్నేశారని.. అశోక్ గజపతిరాజు చాలా రోజుల క్రితమే గుర్తించారు. ఆయన ట్రస్ట్ చైర్మన్‌గా ఉంటే.. ఎవరూ భూముల్లో అడుగుపెట్టలేరు. పెట్టనివ్వలేదు కూడా. చాలా సింపుల్ లైఫ్ స్టైల్‌ను ఇష్టపడే అశోక్ గజపతి రాజు ఇప్పటికీ విజయనగరంలో నానో కారులోనే తిరుగుతారు. ఆడంబరాలకు వెళ్లరు. రాజకీయంగా తనను టార్గెట్ చేసి.. ట్రస్ట్ చైర్మన్ నుంచి తొలగించారని తెలిసినా.. అశోక్ .. ప్రభుత్వంపై రాజకీయ విమర్శలే చేశారు కానీ.. ఆవేశపడలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close