నాడు వివేకా హత్య – నేడు కుటుంబంపై కత్తి !

వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి సీబీఐ ఆఫీసు ముందు తన దర్యాప్తు నివేదికను .. వెల్లడించారు. పూర్తిగా ముందుగానే బట్టీ పట్టినట్లుగా చెప్పిన ఆయన కథనాన్ని… .. వైసీపీ మీడియా, సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. రెండో పెళ్లి వల్లే హత్య జరిగిందని.. దాన్ని కూతురు, అల్లుడే చేశారని తేల్చి ప్రచారం ప్రారంభించారు. చూసేవాళ్లు .. పాపం మొదట తండ్రిని చంపేశారు.. ఇప్పుడు పిల్లలపై నిందలేస్తున్నారు.. ఇదేమీ చోద్యం అనుకునే పరిస్థితి. !

కొత్త కథలను తెరపైకి తెచ్చిన ” జే క్యాంప్ “

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో అడ్డంగా ఇరుక్కుపోయి ఎలా బయటకు రావాలో తెలియక కొత్త కొత్త కథలు అల్లేందుకు తికమక పడుతున్న వైసీపీ పెద్దలు .. కొత్త కథలు వండేస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి రెడ్డి షేక్ షమీమ్ ను రెండో పెళ్లి చేసుకున్నారు. వారికో బిడ్డ ఉన్నాడు. వివేకా అసలు పేరును అక్బర్ గా కూడా మార్చేశారు అవినాష్ రెడ్డి. ఆ బిడ్డను రాజకీయ వారసుడిగా వివేకానందరెడ్డి ఉరఫ్ అక్బర్ ప్రకటించాలనుకున్నారు. ఆస్తులు కూడా రాసివ్వాలనుకున్నారు. ఇది అల్లుడు, కూతురుకు నచ్చలేదు. అందుకే చంపించేశారు.. అని అవినాష్ రెడ్డి దర్యాప్తులో తేలినట్లుగా కళ్లకు కట్టినట్లుగా వివరించారు. మరి వాళ్లెవరో చంపించేస్తే.. అవినాష్ రెడ్డి ఎందుకు సాక్ష్యాలు తుడిచేశాడు.. సీఐ శంకరయ్యను కేసు వద్దని ఎందుకు హెచ్చరించారు…?

గుండెపోటు కథ చెప్పింది అవినాష్ కాదట !

వివేకాను అంత దారుణంగా హత్య చేస్తే.. గుండెపోటుతో చనిపోయారని ఆస్పత్రికి తీసుకెళ్లే వరకూ ఎందుకు చెప్పలేదని ప్రధానంగా వస్తున్న సందేహం. దీనికి అవినాష్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడని తాను ఎవరికీ చెప్పలేదనేశారు. అప్పట్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే గుండెపోటు అంశాన్ని సృష్టించిందని అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఈ మాటలు వింటే.. అవినాష్ రెడ్డికి అప్పట్లో మీడియా ఉందని.. ఆయన మాటలు రికార్డు చేసిందని.. ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయని తెలియదేమో అనే డౌట్ ఎవరికైనా రావొచ్చు. కానీ ఇంత తెగించిన వారు అవన్నీ ఫేక్ వీడియోలని చెప్పరేని గ్యారంటీ ఏమీలేదు.

కేసును సునీతపై తోసేసే లక్ష్యం !

కేసును వివేకా కుమార్తె, అల్లుడిపై తోసేసే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. కొన్నాళ్లుగా చేస్తున్న వాదనను ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నారు. మొత్తంగా అవినాష్ రెడ్డి బరి తెగించేశారని అర్థమైపోతుంది. అప్పుడు ఏం జరిగిందో ప్రజల కళ్ల ముందే ఉంది. దాన్ని కూడా అంతా భ్రమ అని కల్పించి.. ఈ కేసులో వైఎస్ వివేకా కుమార్తె, అల్లుడ్నే బలి చేయాలనుకుంటున్నారని స్పష్టమవుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీనికి వైసీపీ .. ఆ పార్టీ అధినేత పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close