హైకోర్టు ఇచ్చిన బలం – విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి లేఖ!

తుది తీర్పు ఇచ్చే వరకూ అవినాష్ రెడ్డిపై తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించిన ధైర్యంతో అవినాష్ రెడ్డి సీబీఐని పూచిక పుల్లలా చూస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకే 15వ తేదీన సీబీఐ ముందు హాజరు కావాల్సి ఉంది. కానీ నేటి విచారణలో సీబీఐ ఎదుట హాజరు కావాలా వద్దా అన్నది సీబీఐనే అడగాలని హైకోర్టు చెప్పింది. దీన్నే అడ్వాంటేజ్‌గా తీసుకుని అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. మంగళవారం సీబీఐ విచారణకు హాజరు కాలేనని అవినాష్ రెడ్డి లేఖ రాశారు. .పార్లమెంటు సమావేశాలు ఉన్నందున హాజరుపై మినహాయింపు ఇవ్వాలని కోరారు. అవినాష్ లేఖ పై సీబీఐ ఎలా స్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది.

ఉదయం అవినాష్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని చెప్పింది కానీ అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో మాత్రం తదుపరి చర్యలు వద్దని తుది తీర్పు ఇస్తామని చెప్పింది. ఆ తుది తీర్ప ఎప్పుడు వస్తుందో కానీ అప్పటి వరకూ అవినాష్ రెడ్డి అరెస్ట్ లేనట్లే. అయితే వీరిద్దర్నీ అరెస్ట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నామని సీబీఐ చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా హైకోర్టు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడంతో అవినాష్ రెడ్డికి భారీ ఊరట లభించినట్లయింది.

అరెస్ట్ ఉండదు కాబట్టి ఇక సీబీఐ విచారణకు వెళ్లకపోయినా పర్వాలేదనుకుంటున్నారు. పార్లమెంట్ సమావేశాల సాకు చెబుతున్నారు. అవినాష్ రెడ్డి పార్లమెంట్ సమావేశాలకు అసలు హాజరు కారు. ప్రస్తుతం ఉన్న ఎంపీల్లో లోక్ సభలో అతి తక్కువ అటెండెన్స్ ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి. ఆయన పార్లమెంట్ సమావేశాల హాజరు 30 శాతమే. ఇక చర్చల్లో పాల్గొనడమే ఉండదు. ప్రశ్నలు కూడా అడగరు. కానీ ఇప్పుడు విచారణ తప్పించుకోవడానికి పార్లమెంట్ సమావేశాలను కారణంగా చూపిస్తున్నారు. న్యాయవ్యవస్థను అడ్డం పెట్టుకుని విచారణలు ఎలా ఆలస్యం చేసుకోవాలో.. ఎలా అరెస్టులు కాకుండా తప్పించుకోవాలో వీరికి తెలిసినంతగా ఎవరికీ తెలియవన్న విమర్శలు ఇలాంటి వాటి వల్లే వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close