భారం బాబు పెంచేసి బాధ్యత ఇచ్చేస్తా అంటే ఎలా?

పోలవరం ప్రాజెక్టు వ్యవహారం ఇప్పుడు రసకందాయంలో పడుతున్నట్లుంది. పోలవరం ప్రాజెక్టుకు ఏటా వంద కోట్లు ముష్టి లాగా విదిలించిన నేపధ్యంలో చంద్రబాబు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్న సంగతి అందరికి తెలుసు. జాతీయ ప్రాజెక్టు అయిన పొలవరాన్ని కేంద్రం పట్టించుకునే తీరు ఇదేనా అనే విమర్శలు కూడా వస్తూన్నాయి. ఇలాంటి సమయంలో పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్రానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ సీఎం చంద్రబాబు ప్రకటించడం చర్చనీయాంశంగ ఉంది.

వివరాల్లోకి వెళితే …

మొన్నటి వరకు బీజేపీ ని ఎవరు తిట్టినా సరే ఈ విషయంలో వారు రాష్ట్ర సర్కారు మీదనే నెపం వేస్తూ వచ్చారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు గనుక , నిర్మాణ అథారిటీ కి అప్పగించకుండా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకుంటే ఎలా అని కేంద్రం తప్పించుకుంటు వచ్చింది. అయితే ఇప్పుడు చంద్రబాబు ఇచ్చేస్తా అంటున్నారు.

కానీ మధ్యలో ఒక మతలబు ఉంది. చంద్రబాబు సర్కారు పోలవరం బడ్జెట్ ను రివైజ్ చేసేసారు. బాబు సర్కారు అమాంతం వేల కోట్ల రూపాయలు భారం పెంచేసింది.

మరి భారం బాబు పెంచేసి బాధ్యత ను కేంద్రం చేతిలో పెట్టేస్తాం అంటే కుదురుతుందా. కేంద్రం ఒప్పుకుంటుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. బాబు తనకు కావలసిన వారికి తను తలచుకున్న మేలు చేసేసి, వరాలు ఇచ్చేసి .. ఆ వారలు తీర్చే పని కేంద్రం నెత్తిన పెడుతున్నట్లుంది. మరి కేంద్రం ఉన్నది ఉన్నట్లుగా ఈ ప్రతిపాదనకు ఒప్పుకుంటుందా.. అనేది అనుమానమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close