టీటీడీపీ బ్యాక్ స్టెప్: గులాబీ గెలిస్తే ఇక అంతే!

ఇప్పుడు కూడా గులాబీ పార్టీ పాలేరు ఉప ఎన్నికలో విజయం సాధిస్తే గనుక.. తెలంగాణాలో వారి అప్రతిహత విజయ పరంపరకు ఎదురు లేదని నిరూపణ అయినట్లే. అధికారంలో ఉన్న తెరాస కు సహజంగా కొన్ని అనుకూల పవనాలు ఉన్నాయని, ప్రతి విజయం నేపధ్యంలో ఓడిపోయిన ప్రతిపక్షాలు బుకాయిస్తూనే ఉన్నాయి. కానీ, ఈ దఫా అలా కుదరక పోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్షాలు అన్నీ విడివిడిగా కాదు, కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు సానుభూతి పుష్కలంగా ఉన్న ఒకే అభ్యర్థిని బలపరుస్తూ ఉండడం విశేషం. వీరు జాతకలిసిన తరవాత కూడా, తెరాస విజయం సాధిస్తే గనుక, ఇక వారి హవాను ఇప్పట్లో ఎవరు అడ్డుకోవడం అసాధ్యం అని నిరూపణ అయినట్లే.
పాలేరు లో రాంరెడ్డి వెంకటరెడ్డి మరణం నేపథ్యంలో ఏర్పడిన ఖాళీ కి ఉప ఎన్నిక జరుగుతున్నా విషయం మనకు తెలుసు. ఈ ఎన్నికలో అయన భార్య సుచరిత ను ఏకగ్రీవంగా ఎమ్మెల్యే చేయాలని కాంగ్రెస్ తపన పడింది. కానీ, తెరాస వారికంటే ముందే తుమ్మల ను అభ్యర్థి గా బరిలోకి దించేసి, తొడ కొట్టింది. అయితే కనీసం మిగిలిన అన్ని పార్టీల మద్దతు కూడగట్టి, సూచరితను గెలిపించాలన్న కాంగ్రెస్ సంకల్పానికి సిపిఎం గండి కొట్టినా, టీడీపీ సహకరిస్తున్నది.
పాలేరులో పోటీ చేయాలా వద్దా అనే విషయంలో తీవ్రమైన తర్జన భర్జనల అనంతరం, పోటీ చేయరాదని, సుచరిత కు మద్దతు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించుకున్నది. అయితే దీనివల్ల కెసిఆర్ హవాను ఎదుర్కొనడానికి కాంగ్రెస్ తో మిలాఖత్ అయిందనే నిందను వారు భరించాల్సి ఉంటుంది. దానికి వారు సిద్ధపడ్డట్లే ఉంది. సిపిఎం మద్దతును కూడా రాబట్టుకోవడానికి ఏచూరి ద్వారా కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఎలాంటి ఫలితం ఇస్తాయో చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దూరదర్శన్ లోగో కలర్ మార్పు… కారణం అదేనా..?

దూరదర్శన్... చాలా ఫేమస్ ఛానెల్. అప్పట్లో ఎక్కడ చూసినా దూరదర్శన్ ప్రసారాలే.అందుకే దూరదర్శన్ ఛానెల్ కు ఇప్పటికీ అసంఖ్యాకమైన ప్రేక్షకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా, సడెన్ గా దూరదర్శన్ లోగో కలర్...

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close