హైటెక్ సెక్స్ రాకెట్ నడుపుతున్న బైరెడ్డి సిద్ధార్థ ఫ్రెండ్ అరెస్ట్ !

వైసీపీ లీడర్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్నేహితుడు.. సోషల్ మీడియాలో బైరెడ్డి గురించి ఎలివేషన్లు ఇస్తూ ఇంటర్యూలు కూడా ఇచ్చే అఖిల్ పహిల్వానే అనే వ్యక్తిని సెక్స్ రాకెట్ కేసులో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్పాలు, సెలూన్ల ముసుగులోనే కాకుండా హోటళ్లలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అఖిల్ పహిల్వాన్ మిత్ర బృందం అంతా కలిసి ఈ సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

హైక్లాస్ వ్యభిచారం చేయించడంలో వీరు ముందున్నారు. ముందుగా ఫార్చ్యూన్ హోటళ్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను అబిడ్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారం అంతా రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో నడుస్తున్నట్లు బయటపడింది. 16 మంది వెస్ట్ బెంగాల్ అమ్మాయిలను ఫార్చ్యూన్ హోటల్లో 25 రోజులుగా ఉంచి వ్యభిచారం చేయిస్తున్నాడు. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా ఈ అమ్మాయిలందరినీ హోటల్లో పెట్టినట్లు గుర్తించారు. హోటళ్లో 25 రూములు తీసుకొని, వాటిలో 16 రూములను వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్నట్లు తేలింది.

అఖిల్ పహిల్వాన్‌‎ను అదుపులోకి తీసుకొని అతని పూర్వ ట్రాక్ రికార్డ్ పోలీసులు బయటికి తీశారు. అఖిలేష్ మొబైల్ ఫోన్లో జాతీయ, అంతర్జాతీయ వ్యభిచారం ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లు పోలీసులు గుర్తించారు. రోజుకి 20 నుంచి 30 కాల్స్ నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. సినీ ప్రముఖులకు కూడా అమ్మాయిలను సప్లై చేస్తున్నట్లు అఖిల్ పై పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్‌తో పాటు ఏడుగుర్ని అరెస్టు చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close