హిందూపురం ప్రజల మనసుల్ని గెల్చుకున్న బాలకృష్ణ !

కష్టం వచ్చినప్పుడు ఆదుకునేవాడే అసలైన రాజకీయ నాయకుడు. ఆ నాయకత్వ లక్షణాలు తనకు ఉన్నాయని నందమూరి బాలకృష్ణ నిరూపించారు. అసాధారణ వర్షాలతో అతలాకుతలమైన హిందూపురం నియోజకవర్గంలోనే మకాం వేసి మరీ సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. షూస్‌కు మరకలు అవుతాయని.. ఇస్త్రి బట్టలు నలిగిపోతాయని ఆయన అనుకోలేదు. మోకాలు లోతు నీళ్లలో ప్రజల్ని పరామర్శించారు. వారికి నిత్యావసరాలు అందించారు. అప్పటికప్పుడు సొంత నిధులతో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. బాలకృష్ణ సహాయ కార్యక్రమాలు అక్కడి ప్రజల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.

నిజానికి బాలకృష్ణహిందూపురం ఎమ్మెల్యే అయినా ఎప్పుడూ అక్కడే ఉండరు. ఆయన ఎక్కువగా హైదరాబాద్ లో ఉంటారు. ఆయన తరపున పీఏలు పనులు చక్కబెడుతూంటారు. అయితే ఎమ్మెల్యేగా ప్రజలకు అందించాల్సిన సేవల విషయంలో ఏ మాత్రం రాజీ పడరు. తాను రావాల్సినప్పుడు తాను ఖచ్చితంగా వస్తారు. తన అవసరం లేనప్పుడు సిబ్బందితో పనులు చేయించేస్తారు. హిందూపురం జిల్లాను హిందూపురం కేంద్రంగా చేయడానికి ఆయన పోరాడారు.ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉంటే వచ్చేశారు.

అయితే వైసీపీ నేతలు మాత్రం తరచూ బాలకృష్ణ విషయంలో వివాదాస్పదంగా వ్యవహరిస్తూంటారు. అనుచితమైన కామెంట్లు చేస్తూంటారు. కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లలో హిజ్రాలతో కేసులు పెట్టిస్తూంటారు. అయితే బాలకృష్ణ అంటే ఏంటో అక్కడి ప్రజలకు అర్థమైపోయింది. కరోనా సమయంలో సొంత డబ్బులతో ఆస్పత్రులను బాగు చేయించారు. ఆదుకున్నారు. ఇప్పుడు వరదల విషయంలోనూ అండగా నిలిచారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close