నందమూరి కుటుంబం నుంచి మరో కధానాయకుడు వెండితెరకు రాబోతున్నాడు. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి” సమయంలో మోక్షజ్ఞ ఎంట్రీపై చాలా వార్తలు వచ్చాయి. దర్శకుడు క్రిష్ కి మోక్షజ్ఞని లాంచ్ చేసి భాద్యతను బాలయ్య ఇచ్చారని, వారాహి బ్యానర్ లో ఈ సినిమా ఉటుందని వార్తలు వచ్చాయి. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో వుండదని, ఇంకొంత సమయం పడుతుందని క్లారిటీ ఇచ్చారు బాలయ్య.
ఇప్పుడు మరోసారి మోక్షజ్ఞ ఎంట్రీపై చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్ జీవిత కథను బయోపిక్గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ కనిపిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం. ఈ సినిమా ద్వారా మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం అవుతాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం కూడా వుంది. మోక్షజ్ఞని ఇందులో చూపించాలని గట్టిగా భావిస్తున్నాడు క్రిష్. బాలయ్య కూడా మొదట దీనికి అంగీకారం తెలిపారు. అయితే ఇప్పుడు ఆయన డైలమాలో పడ్డాడు. దీనికి కారణం.. ఎన్టీఆర్ బయోపిక్ కి సంబధించి అన్ని కీలక పాత్రల ఎంపిక జరిగిపోయింది. మోక్షజ్ఞకి సరిపోయే పాత్ర కుదరడం లేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తనయుడికిగా యువ బాలకృష్ణ పాత్రలో మోక్షజ్ఞని చూపించాలని మొదట అనుకున్నారు. అయితే అలా కుదరలేదు. ఈ పాత్ర కూడా బాలయ్యే చేశారు.
ఇప్పుడు మోక్షజ్ఞని ఎలా చూపించాలనే ఆలోచనలో వున్నారు క్రిష్. బాలయ్య ఆలోచన మాత్రం భిన్నంగా వుంది. సరైన పాత్ర కుదరకపోతే ఈ ఆలోచన వదులుకోవాలని, మోక్షజ్ఞని ఏదోలా ఇరికించేలా వుండకూడదని క్రిష్ తో చెప్పినట్లు తెలిసింది. అయితే క్రిష్ మాత్రం ఇందులో మోక్షజ్ఞ ఎలాగైనా చూపించాలానే పట్టుదలతో వున్నారట.
అక్కినేని ”మనం”లో అఖిల్ కి మంచి ఎంట్రీ దొరికింది. చివర్లో వచ్చినా ప్రేక్షకుల మనసులు దోచేశాడు అఖిల్. ఇప్పుడు క్రిష్ కి కూడా అలాంటి స్పార్క్ వున్న పాత్ర ఏదైనా తట్టకపోతే మాత్రం మోక్షజ్ఞ ఎన్టీఆర్ బయోపిక్ లో కనిపించే అవకాశం లేనట్లేనని అనుకోవాలి.