ఆ వార్తలపై భూమా స్పందనకి అర్ధం అదేనేమో?

వైకాపా నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి, ఆయన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ ఇద్దరూ తెదేపాలో చేరబోతున్నట్లు ఈరోజు మీడియాలో వార్తలు వచ్చేయి. పార్టీ మారే ఉద్దేశ్యంలేని వారు అటువంటి వార్తల వలన పార్టీతో తమ సంబందాలు దెబ్బ తింటాయనే భయంతో వెంటనే వాటిని ఖండించడమే కాకుండా, తన పార్టీ అధిష్టానానికి నమ్మకం కలిగించదానికి తాము ఏ పార్టీలో చేరుతామని వార్తలు వచ్చేయో ఆ పార్టీపై విమర్శలు కూడా చేస్తుంటారు.

ఈ వార్తలపై స్పందించమని భూమా నాగిరెడ్డిని కొందరు విలేఖరులు కోరినప్పుడు “రోజూ అటువంటి వార్తలు వస్తూనే ఉంటాయి. ప్రతీ దానిపై స్పందించలేము కదా.. వాటి గురించి పూర్తి వివరాలు చేతికి అందిన తరువాత మాట్లాడుతాను,” అని జవాబు చెప్పారు. ఇదంతా చెప్పే బదులు “ఆ వార్తలను నేను ఖండిస్తున్నాను. పార్టీ మారే ఆలోచన మాకు లేదు,” అని చెప్పి ఉండి ఉంటే ఆయన పార్టీ మారడం లేదనే విషయం ఖరారు చేసినట్లుండేది. కానీ ఆయన ఖండించలేదు కనుక పార్టీ మారడం ఖాయమనే భావించాల్సి ఉంటుంది. ఆయనకి చంద్రబాబు నాయుడు మంత్రి పదవిని ఆఫర్ చేసినట్లువార్తలు వచ్చేయి. అదే నిజమయితే ఆయన తప్పకుండా పార్టీ మారవచ్చును.

అయితే ఈ వార్తలపై ఆయన బావమరిది కర్నూలు వైకప ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి స్పందన చాలా ఆలోచనాత్మకంగా ఉంది. “ప్రభుత్వం ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న కారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులకే తమ నియోజక వర్గాలలో అభివృద్ధి పనులను చేయించుకోలేక అవస్థలు పడుతున్నప్పుడు తెదేపాలోకి వెళ్లి ప్రయోజనం ఏముంటుంది? తెదేపాలోకి వెళ్లి ప్రయోజనం లేనప్పుడు వైకాపాలోనే కొనసాగితే నష్టమేమిటి? అయినా భూమానాగిరెడ్డి తెదేపాలో చేరుతారని నేను భావించడం లేదు,” అని అన్నారు. కానీ భూమానాగిరెడ్డి స్పందన చూస్తే ఆయన పార్టీ మారే ఆలోచనలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. నేడో రేపో ఆయనే ఈ సస్పెన్స్ కి తెర దించుతారేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close