ఆళ్లగడ్డలో ప్రారంభమైన యూరేనియం మంట..!

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయానికి యూరేనియం అంటుకుంది. కడప జిల్లా పులివెందులలో ఇప్పటికే యూరేనియం సెగ ఓ రేంజ్‌లో ఉండగా… ఇప్పుడు అది ఆళ్లగడ్డకు పాకింది. తెలంగాణలో యూరేనియం తవ్వకాలు జరపవద్దంటూ.. ఆందోళన చేస్తూంటే.. ఏపీలో తవ్వకాలు కూడా ప్రారంభించేశారు. ఆళ్లగడ్డ మండలం యాదవాడలో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ విషయం ఆలస్యంగా బయటకు రావడంతో… రాజకీయం యూరేనియం చుట్టూ తిరగడం ప్రారంభమయింది. మాజీ మంత్రి, ఆళ్లగడ్డ భూమా అఖిల ప్రియ యాదవాడ వెళ్లి పనులను అడ్డుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా యాదవాడలో యురేనియం ఖనిజాన్వేషణ చేస్తున్నారని మండిపడ్డారు.

మరో వైపు ఇదే అంశంపై… సీఎం జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ రాశారు. ఆళ్లగడ్డ ఏరియాలో యురేనియం డ్రిల్లింగ్‌ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండానే డ్రిల్లింగ్ పనులు జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. యురేనియానికి వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిందని.. ఏపీలో ఏకంగా ఏపీలో తవ్వకాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. తదుపరి పోరాట కార్యచరణను.. ప్రజాసంఘాలు ఖరారు చేసుకునే పనిలో ఉన్నాయి. తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ.. యూరేనియంకు వ్యతిరేకంగా ఏక తాటిపైకి వచ్చాయి. దాంతో ప్రభుత్వం దిగి వచ్చి.. అసెంబ్లీలో తీర్మానం చేసింది. తవ్వకాలకు అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదని తేల్చిచెప్పింది.

అయితే… అనూహ్యంగా ఏపీలో మాత్రం.. ఎలాంటి నిరసనలు కనిపించడం లేదు పులివెదులలో యూరేనియం ఫ్యాక్టరీ వల్ల అనర్థాలు జరుగుతున్నప్పటికీ.. ఏ పార్టీ కూడా.. పూర్తి స్థాయిలో ఉద్యమించలేదు. ఫలితంగా..ఆళ్లగడ్డలోనూ తవ్వకాలు ప్రారంభించారు. ప్రజలు అనారోగ్యం బారిన పడి… జీవశ్చవాలుగా మారే వరకూ.. ఇంతే నిర్లిప్తంగా ఉంటారేమోనని ప్రభుత్వంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close