విభజన చట్టాన్ని పక్కన పడేసిన కేంద్ర కేబినెట్!

విభజన చట్టాన్ని పక్కన పడేసిన కేంద్ర కేబినెట్!
నోరుపెగలని రాష్ట్రం -తెలుగుదేశం

ప్రత్యేక హోదాని పక్కన పెట్టేసిన కేంద్రప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ పేరుతో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు చట్టబద్ధంగా రావలసిన హక్కుల్ని కూడా పక్కకి నెట్టేసింది.

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో చెప్పిన మాటలను ఏడు నెలల తరువాత కేంద్రకేబినెట్ బుధవారం ఆమోదించడం మినహా కొత్తగా ఒరగబెట్టింది ఏదీ లేదు.

పాలనా సంబంధమైన ఈ నిర్ణయాన్ని ”ప్రత్యేక హోదాకు చట్టబద్ధత” అనే బ్రేకింగ్ న్యూసులతో టివిలు అఙ్ఞానాన్ని ఘనంగా చాటుకున్నాయి. తప్పిదానికి సిగ్గుపడి ఆ ఆప్రస్తావనే లేకుండా పొడిపొడిగా వార్తని చదివేసి ఊరుకున్నాయి.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణవ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరించాలన్నది విభజనచట్టంలో క్లాజు. బుధవారం నాటి కేబినెట్ సమావేశం కూడా నబార్డు ద్వారా ఆ సహాయం చేయడానికే అంగీకరించింది. తాజా అంచనాల ఈ నిర్మాణవ్యయం 42 వేల కోట్ల రూపాయలు అని రాష్ట్రప్రభుత్వం చెబుతోంది. మారిన అంచనాలను ఇప్పటికీ కేంద్రానికి పంపి ఆమోదం తీసుకోనేలేదు. ఇప్పటికే ఖర్చు చేసిన మొత్తంపై అకౌంట్లు కూడా కేంద్రానికి రాష్ట్రం అందజేయలేదు.

ఈ నేపధ్యంలో ప్రాజెక్టులో ఇరిగేషన్ కంపోనెంటుకి మాత్రమే కేంద్రం సాయంచేస్తుందన్న కేబినెట్ నిర్ణయాన్ని బట్టి చూస్తే పోలవరం ప్రాజెక్టుపై డిల్లీ నుంచి పెద్దగా నిధులు రాకపోవచ్చన్నది ప్రాజెక్టు ఇంజనీర్ల అభిప్రాయం.

ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రప్రభుత్వానికి పారిశ్రామిక రంగం అభివృద్దీ విస్తరణలకు 90 శాతం గ్రాంటులు రావలసి వుంది. ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఇది 60 శాతానికి తగ్గిపోతుంది. మిగిలిన 30 శాతం మొత్తాన్నీ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన విదేశీ సంస్ధల రుణాలను 2015 నుంచీ ఐదేళ్ళ పాటు కేంద్రప్రభుత్వమే తీర్చడం ద్వారా సర్దుబాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

ఈ విధంగా తానే చెల్లించవలసిన మొత్తం ఏడాదికి 3 వేలకోట్లరూపాయల చొప్పున ఐదేళ్ళకీ 15 వేల కోట్ల రూపాయలు అవుతుంది. ఇప్పటికే రెండేళ్ళు గడచింది. మిగిలిన మూడేళ్ళలో విదేశీ రుణాలు తీసుకోడానికి కేంద్రం అనుమతి వుండాలి. ఇప్పటికే తెచ్చుకున్న విదేశీ రుణాలపై వాటి వినియోగంపై లెక్కలు చెప్పి 6 వేలకోట్ల రూపాయలు రాబట్టుకోవలసి వుంది.

మంత్రి పార్లమెంటులో చెప్పిన విషయాలు కేబినెట్ లోకి రావడానికే 7 నెలలు పట్టింది. అకౌంట్ ఇచ్చి విదేశీ రుణం పై అనుమతులు సాధించడం పెద్దప్రొసీజర్. బిజెపి ప్రభుత్వం తాను చేయాలనుకున్నది చేయడమే తప్ప తెలుగుదేశం ప్రభుత్వం అడిగినవి చేయగల రాజకీయ వాతావరణం కూడాలేదు.

కేబినెట్ నిర్ణయమన్నది అంతా పద్ధతిగా చేశారు అనిపించుకోడానికే తప్ప అందులో ఆచరణాత్మకమైన సమస్యలు వున్నాయి. రెండు పార్టీలు, ప్రభుత్వాల మధ్య రాజకీయ సామరస్యం వుంటేనే ఫైళ్ళు పరుగులు తీస్తాయి. లేకపోతే పరిశీలన సాగుతూనే వుంటుంది.

అన్నిటికీ మించి స్పెషల్ ప్యాకేజీ ని కేబినెట్ ఆమోదించడం అంటే అది ఉన్నత స్ధాయి నిర్ణయమే తప్ప చట్టం కాదు. దీనిపై మీడియా విశ్లేషణలు చేయకపోవడం దారుణం..రాష్ట్రప్రభుత్వమో తెలుగుదేశమో నోరు మెదపకపోవడం మరీ అన్యాయం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close