వైసీపీపై నేతకొక విధానం పాటిస్తున్న బీజేపీ..!

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పై బీజేపీ విధానం ఏమిటి..?. ఎన్నికలకు ముందు తాము గెలవకపోయినా పర్వాలేదు.. వైసీపీ గెలవాలన్నంత ఆప్తమిత్రులుగా మెలిగారు.. బీజేపీ నేతలంతా. చివరికి… ఢిల్లీ నుంచి అగ్రనేతలంతా ప్రచారానికి వచ్చినా.. టీడీపీని ఓడించమని పిలుపునిచ్చారు కానీ…బీజేపీని గెలిపించమనలేదు. అంటే.. వారు కూడా పరోక్షంగా వైసీపీనే గెలిపించమన్నారు. ఎలా అయితేనేమి… టీడీపీని 30 సీట్లలోపే పరిమితం చేస్తామన్న వారి చాలెంజ్‌ను నిరూపించుకున్నారు. మరి ఇప్పుడు.. వైసీపీతో.. బీజేపీకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయంటే… మాత్రం.. ఎవరూ చెప్పలేకపోతున్నారు. వైసీపీపై బీజేపీ నేతలు… ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యవహరిస్తున్నారు. చోటా నేతలు కాకుండా.. ఏపీ వ్యవహారాలు చూసుకునే.. కన్నా, జీవీఎల్ కూడా.. వైసీపీపై తలో విధానాన్ని అనుసరిస్తున్నారు.

వైసీపీని వెనకేసుకు వస్తున్న జీవీఎల్..!

ఏపీలో టీడీపీతో కటిఫ్ అయిన తర్వాత బీజేపీ వ్యవహారాల్ని.. యూపీ ఎంపీ.. జీవీఎల్ నరసింహారావు దాదాపుగా టేకోవర్ చేశారు. ఆయననే… కేంద్రం తరపున.. జరిగిన అన్ని వ్యవహారాలను… కనుసన్నల్లో నడిపించారన్న అభిప్రాయం ఉంది. ఆయన టీడీపీపై మామూలుగా ఎటాక్ చేయలేదు. ఇప్పుడు.. కూడా.. ఆయన పదును తగ్గించలేదు. అదే సమయంలో.. వైసీపీతో.. ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించాలన్న.. ఉద్దేశాన్ని ఆయన పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వ పరంగా.. జగన్ నిర్ణయాలపై.. తీవ్ర వ్యతిరేకత వస్తున్నప్పటికీ.. పార్టీ పరంగా మాత్రం.. జీవీఎల్..వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు. అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంట్రాక్టుల రద్దుకు మద్దతు తెలుపుతున్నట్లుగా ప్రకటించారు.

జగన్ పాలనపై దుమ్మెత్తి పోస్తున్న కన్నా..!

మరో వైపు .. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మాత్రం…వైసీపీపై ఒంటికాలితో లేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన టీడీపీ నిర్ణయాన్ని సమర్థించడం కలకలం రేపుతోంది. కాపు రిజర్వేషన్లను చంద్రబాబు చట్టబద్దంగానే ఇచ్చారని.. అయినా జగన్ రద్దు చేశారని… కన్నా మండి పడుతున్నారు. ప్రస్తుతం.. ఏపీలో జరుగుతున్న పాలనతో.. అంతా.. అస్తవ్యస్తంగా తయారైందని.. కన్నా మండి పడుతున్నారు. అంతా ఆత్రమే జగన్ పాలనలో కనిపిస్తోందంటున్నారు. అవినీతి ఆరోపణలు కూడా చేస్తున్నారు.

ఇద్దరిలో బీజేపీ విధానం ఏది..?

ఓ వైపు… జీవీఎల్ సాఫ్ట్‌గా.. మరో వైపు .. కన్నా హార్డ్ గా.. వైసీపీపై తమ రాజకీయ విధానాన్ని పాటిస్తున్నారు. మిగతా వారు కూడా.. అటో ఇటో విడిపోయారు. కానీ పాత కాపు నేతలు మాత్రం.. ఈ రాజకీయాలకు ప్రేక్షకులుగానే మిగిలిపోయారు తప్ప.. ఎలాంటి రాజకీయ హడావుడి చేయడం లేదు. సోము వీర్రాజులాంటి నేతలు… జీవీఎల్‌ను ఫాలో అవుతున్నారు. ఇష్టం లేని వాళ్లు.. కన్నా విధానానికి జై కొడుతున్నారు. మొత్తానికి..వైసీపీ విషయంలో బీజేపీలో క్లారిటీ లేదన్న అంచనాలు మాత్రం వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close