బెంగాల్‌లో ఇలాగే ఉంటే బీజేపీ ఏం చేసేది..!?

బెంగాల్‌లో రాజకీయ హింస జరిగి రెండు పార్టీల కార్యకర్తలు దాడులు.. హత్యలకు దిగితే.. ఇక రాష్ట్రపతి పాలనే అన్నట్లుగా అక్కడి గవర్నర్ హడావుడి చేశారు. కేంద్ర హోంశాఖ హుటాహుటిన స్పందించి నివేదికలు పంపాలని ఆదేశించింది. బీజేపీ ఎమ్మెల్యేలకు కేంద్ర భద్రత కల్పించారు. అంత కంటే దారుణమైన పరిస్థితులు ఏపీలో కనిపిస్తున్నా.. ఇక్కడి గవర్నర్‌కు నోరు పెగలడం లేదు. అసలు ఏం జరుగుతుందో.. ఆయన కనీసం నివేదిక కూడా తెప్పించుకుంటున్నట్లుగా లేరు. కోర్టుల్ని గౌరవించకపోయినా.. ఆదేశాల్ని పాటించకపోయినా.. మౌనం పాటిస్తున్నారు.

ఓ ఎంపీ విషయంలో ఇంత దారుణంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్లుగా కళ్ల ముందు కనిపిస్తున్నా… రాజకీయ వేధింపుల లక్ష్యంగానే రఘురామరాజును సీఐడీ టార్గెట్ చేసిందని.. తెలుస్తున్నా.. గవర్నర్ మాత్రం.. నోరు మెదపడం లేదు. కేంద్ర హోంశాఖకు లేఖలు రాసినా స్పందన లేదు. కస్టడీలోకి తీసుకుని ఓ ఎంపీని కొట్టడం అంటే.. స్వతంత్ర భారతావని చరిత్రలో ఇంత వరకూ ఇలాంటి ఘటన జరగలేదని.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్రపతికి… కేంద్రహోంశాఖ కార్యదర్శికి లేఖలు రాశారు. ప్రభుత్వ అధీనంలో ఉండే… ప్రభుత్వం నియంచిన సూపరింటెండెంట్… ప్రభుత్వం కోరినట్లుగానే మెడికల్ రిపోర్ట్ ఇస్తారు.. కాళ్లు వాచాయి. .. రంగు మారాయి.. కానీ కొట్టిన గాయాలు కాదని.. వైద్యులు ఎలా నివేదిక ఇచ్చారో కానీ.. ఆ నివేదికే హాస్యస్పదమవుతోంది.

ఏపీలో రాజ్యాంగ పాలన లేదని.. తక్షణం విచారణ జరిపి.. రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్లు…. అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి ఇతర రాష్ట్రాల్లో అంటే.. బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న రాష్ట్రాల్లో ఉంటే.. మాత్రం పరిస్థితి వేరుగా ఉండేదనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజ్యాంగం.. చట్టం.. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోవడం అంటే నియంతృత్వం వైపు వేగంగా అడుగులు వేయడమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని ఆల్విన్ ఫార్మా కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో...

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close