తమిళనాడులో డీఎంకేను గెలిపిస్తున్నది బీజేపీనే..!

ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో చాలా స్పష్టమైన తీర్పు వస్తుందని అందరూ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన రాష్ట్రం తమిళనాడు. అక్కడ ద్రవిడ దిగ్గజాలు ఇద్దరూ లేకుండా జరిగిన ఎన్నికల్లో స్టాలిన్ ఒక్కడే లీడర్‌గా ప్రజల ముందు నిలబడ్డారు. అయితే ఏకపక్షంగా ఆయనకు ప్రజలు మద్దతివ్వడానికి బీజేపీనే కారణంగా చెప్పుకోవచ్చు. తమిళనాడులో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ పార్టీతో జట్టు కట్టిన వారికి కూడా ఓట్లేసే పరిస్థితి లేదు. అయినప్పటికీ పట్టు బట్టి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని.. కొన్ని సీట్ల అయినా సరే తీసుకుని పోటీ చేశారు.

అంత వరకూ బాగానే ఉన్నా… ప్రచారంలో కూడా చురుగ్గా ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేశారు మోడీ, అమిత్ షా. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అర్థం చేసుకున్న డీఎంకే.,.. మరింత విస్తృతంగా మోడీ, అమిత్ షాలను అన్నాడీఎంకే తరపున ప్రచారం చేయాలని సెటైర్లు వేసేంత పరిస్థితి వచ్చింది. పరిస్థితిని… అన్నాడీఎంకే నేతలు..బీజేపీకి చెప్పే పరిస్థితి లేదు. అదే సమయంలో మోడీ, అమిత్ షాలు కూడా అర్థం చేసుకోలేకపోయారు. వారు తరచూ ప్రచారం చేశారు. ఫలితంగా… సోషల్ మీడియాలో వారు తమిళనాడు వచ్చినప్పుడల్లా.. గో బ్యాక్ మోడీ, అమిత్ షా లు ట్రెండింగ్‌లో నిలిచాయి.

ఈ పరిస్థితులకు తోడు… ఎన్నికలకు మూడు, నాలుగు రోజుల ముందు స్టాలిన్ కుమార్తె ఇంటిపై ఐటీదాడులు చేయించడం కలకలం రేపింది. స్టాలిన్ అల్లుడు అంటూ ప్రచారం చేయించినా.. కుమార్తెను అమిత్ షా టార్గెట్ చేశారన్న అభిప్రాయం తమిళుల్లో ఏర్పడింది. దీంతో ఢిల్లీ నాయకత్వంపై మరింత ఆగ్రహం తమిళుల్లో ప్రారంభమయింది. చివరికి స్టాలిన్‌కు ఈ ఎన్నికల్లో ఉన్న ప్లస్ పాయింట్లకు తోడు… బీజేపీ నేతలు మరింత బలాన్ని ఇచ్చినట్లయింది. ఫలితంగా స్టాలిన్ గెలుపు నల్లేరుపై నడకలాగా మారిపోయిందన్న అభిప్రాయం… తమిళనాడులోనే కాదు.. అంతటా వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close