శ్రీవారిని ఒక్క సారీ దర్శించుకోని వైసీపీ అభ్యర్థి..!

తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తిపై భారతీయ జనతా పార్టీ నేతలు కొత్త కొత్త విషయాలు ప్రసారం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి ఇంత వరకూ ఒక్క సారంటే ఒక్క సారి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోలేదని ప్రచారం ప్రారంభించారు. అలా దర్శించుకోకపోగా…ఆయన చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేసి… నామినేషన్ వేశారని.. ఫోటోలు బయట పెట్టారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రెస్ మీట్ పెట్టి అవే ఆరోపణలు చేశారు. గురుమూర్తి మీద బీజేపీ మొదటి నుంచి ఇవే ఆరోపణలు చేస్తోంది. ఆయన క్రిస్టియన్ అని.. ఎస్సీ రిజర్వేషన్ కేటగిరి నుంచి పోటీ చేయడానికి అనర్హుడని అంటోంది. మతం మార్చుకున్న వారికి రిజర్వేషన్లు వర్తించవని.. బీజేపీ నేతలు అంటున్నారు.

నిజంగా గురుమూర్తి మతం మార్చుకుంటే… ఆయనను అనుర్హుడ్ని చేయడానికి బీజేపీకి ఎంతో సేపు పట్టదు. కానీ.. ఆయన మతం మార్చుకున్నారని నిరూపించడానికి బదులు.. ఆయన క్రిస్టియన్ అని ప్రచారం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. గురుమూర్తి క్రిస్టియనేనన్న విషయం … వైసీపీ నేతలందరికీ తెలుసు. తిరుపతిలో ఆయన అభ్యర్థిత్వాన్ని జగన్ ప్రకటించినప్పుడు.. కొంత మంది గుసగుసలాడుకున్నారు. ఎవరితోనూ చర్చించకుండా జగన్ నిర్ణయాన్ని ప్రకటించడంతో ఎవరూ తమ అభిప్రాయాన్ని చెప్పే సాహసం కూడా చేయలేదు. జగన్ నిర్దేశించినట్లుగా గురుమూర్తి విజయం కోసం ప్రయత్నిస్తున్నారు.

అయితే శ్రీవారిని దర్శించుకోకపోయినంత మాత్రాన.. తిరుపతిలో పోటీ చేయకూడదా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. టెంపుల్ సిటీ అయిన తిరుపతి కేంద్రంగా ఉన్న లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఓ క్రిస్టియన్ ఎంపీగా వెళ్తే అది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ కోణంలోనే ఓట్ల వేట సాగిస్తున్నారు. కొసమెరుపేమిటంటే… బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ పై కూడా… క్రిస్టియన్ అనే ప్రచారం ఉంది. ఆమె భర్త కుటుంబం క్రిస్టియానిటీని ఆచరిస్తారు. ఈ విషయంపై ఫోటోలతో సహా ప్రచారం అవుతోంది. కానీ.. బీజేపీ వాటిని పట్టించుకోవడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close