బీజేపీ స్లోగన్ : గెలిపిస్తే తిరుపతికి కేంద్రమమంత్రి పదవి…!

తిరుపతిలో గెలిపిస్తే.. అలా గెలిచే ఎంపీని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుంటామని తద్వారా… తిరుపతి అభివృద్ధికి ఆ కేంద్ర మంత్రి దండిగా నిధులు తీసుకు వచ్చి సహకరిస్తారని… ప్రచారం చేయాలన్న వ్యూహాన్ని భారతీయ జనతా పార్టీ ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో బీజేపీకి గడ్డుకాలం నడుస్తోంది. విభజన హామీలు ఏమీ అమలు చేయకపోగా.. పోలవరం లాంటి ప్రాజెక్టులు.. అమరావతి, విశాఖ స్టీల్ ఇలా అన్నీ వరుసగా శిధిలం చేస్తున్నారన్న అసహనం బీజేపీ నేతలపై ఉంది. ఇలాంటి క్రమంలో.. బీజేపీ ఇప్పుడు.. కేంద్రంలో తమకు ఉన్న అధికారాన్నే చూపించి.. ఓట్ల వేట సాగించాలని నిర్ణయించుకుంది. అందు కోసం కేంద్ర మంత్రి పదవి అనేది తిరుపతి ప్రజలకు తాయిలంగా వేస్తోంది.

కేంద్ర కేబినెట్‌లో ప్రస్తుతానికి ఏపీకి ప్రాతినిధ్యం లేదు. సహజంగా కేంద్ర కేబినెట్ అంటే ప్రతీ రాష్ట్రానికి ఒకరికి చాన్స్ ఇస్తారు. ఏపీ అంటే నిర్లక్ష్యమో.. బీజేపీకి అంతగా పట్టులేదని అనుకున్నారో కానీ.. ఏపీ నుంచి ఒక్కరంటే ఒక్కరికి కూడా కేంద్రమంత్రి పదవి ఇవ్వలేదు. కేరళకి.. తెలంగాణకి కూడా కేంద్రమంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉంది. కానీ ఏపీ నుంచి లేదు. ఇప్పుడు ఏపీ నుంచి ప్రాతినిధ్యం కావాలంటే.. బీజేపీ ఎంపీని గెలిపించాలని ఆ పార్టీ నేతలు కోరబోతున్నారు. రిజర్వుడు నియోజకవర్గం కావడం… పార్టీలో పేరు పొందిన దళిత నేతలెవరూ లేకపోవడంతో.. రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులపై దృష్టి సారించారు. కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభ పేరు ఎక్కువగా వినిపించింది. కానీ ఆమె తిరస్కరించారేమో కానీ.. దాసరి శ్రీనివాసులు అనే రిటైర్డ్ అధికారి పేరు ఇప్పుడు వినిపిస్తోంది.

భారతీయ జనతా పార్టీ గతంలో టీడీపీ మద్దతులో ఓ సారి పార్లమెంట్ స్థానంలో గెలిచింది. ఒంటరిగా పోటీ చేసినప్పుడు కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు ఎలాగైనా రాష్ట్రంలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ… దుబ్బాక, గ్రేటర్ తరహాలో… ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న పట్టుదలతో ఉంది. జనసేన మద్దతు అదనపు బలమని.. తాము గట్టి పోటీ ఇస్తామన్న నమ్మకంతో ఉన్నారు. తిరుపతి ప్రజలు ఈ కేంద్రమంత్రి పదవి ఆఫర్‌కు ఆకర్షితులవుతారో లేదో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close