మాకేం తెలియదు..! వైసీపీ ఎన్డీఏలో చేరికపై ఏపీ బీజేపీ రియాక్షన్ ..!

ఎన్డీఏలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరబోతోందని జరుగుతున్న ప్రచారం ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నేతలతో పాటు.. వైసీపీలోని కొంత మంది ఇతర నేతలకూ ఎలాంటి సమాచారం లేక ఎలా స్పందించాలో తెలియక తంటాలు పడుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ గా ఉన్న సునీల్ ధియోదర్.. ఈ అంశంపై.. నొప్పింపక.. తానొవ్వక అన్నట్లుగా స్పందించడానికి ప్రయత్నించారు. నేరుగా వైసీపీని ఎన్డీఏలో చేర్చుకుంటున్నారా.. అన్న ప్రశ్నలకు… టీడీపీతోగానీ, వైసీపీతోగానీ ఎలాంటి పొత్తు లేదని చెప్పుకొచ్చారు. రెండు పార్టీలు మాకు రాజకీయంగా శత్రువులే..వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు ప్రకటించారు. టీడీపీకి ఎప్పుడో తలుపులు మూసేశారు కాబట్టి… వైసీపీ ఒక్కదానిపై స్పందించలేక.. ధియేధర్.. టీడీపీని కలిశారు. అయితే.. ఆయన స్పందన వైసీపీ ప్రకారమే చూసుకుంటే… ఆ పార్టీతో ఎలాంటి విబేధాలు లేవని… షరతులు వర్తిస్తాయన్నట్లుగా ప్రకటించారు.

మంత్రి బొత్స సత్యనారాయణ కూడా దాపుగా ఇలాంటి ప్రకటనే చేశారు. బీజేపీతో ఎలాంటి ఘర్షణ అవసరం లేదని ప్రకటించారు. బీజేపీతో వైసీపీ పొత్తుపెట్టుకుంటుందని జరుగుతున్న ప్రచారం మాత్రమేనని సునీల్ ధియోధర్ చెబుతున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కూడా… ఎన్డీయేలో వైసీపీ చేరడంపై సమాచారం లేదని ప్రకటించారు. టీడీపీ, వైసీపీకి సమానదూరంలో ఉండాలనేది తమ పార్టీ విధానమని ఆయన అంటున్నారు. బొత్స ఎందుకలా మాట్లాడారో తెలియడం లేదని ఆశ్చర్యం వ్యక్త ంచేశారు. ప్రధాని, హోంమంత్రిని సీఎం కలవడం సహజమేనని బీజేపీ నేతలు చెబుతున్నారు.

అయితే నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా… పరిస్థితి మారింది. వైసీపీలో ఎవరు ఏం మాట్లాడాలన్నా… వైసీపీ ముఖ్యుల నుంచి స్క్రిప్ట్ వస్తుంది. అలాంటిదేమీ లేకుండా బొత్స సత్యనారాయణ.. బీజేపీతో పొత్తుల గురించి మాట్లాడే అవకాశం లేదు. ఇటీవలి కాలంలో కీలకమైన విషయాలపై లీకులన్నీ.. వైసీపీ హైకమాండ్.. బొత్స ద్వారానే ఇప్పిస్తోంది. తాజాగా… ఇది కూడా ఆ కోణంలోనిదేనని భావిస్తున్నారు. మొత్తంగా బయటకు వచ్చే సరికి అందరూ లేదు లేదు అనడమే రాజకీయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ‌ ఈ శిరోముండ‌నం కేసు ఏంటీ?

వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుత మండ‌పేట తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ శిరోముండ‌నం కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌గా... అసలు ఆరోజు ఏం జ‌రిగింది? ఎందుకు ఇంత...

విష్ణు ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీ: భ‌క్త‌క‌న్న‌ప్పపై పుస్త‌కం

రాజ‌మౌళి మెగాఫోన్ ప‌ట్టాక‌, మేకింగ్ స్టైలే కాదు, ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీలు కూడా పూర్తిగా మారిపోయాయి. `బాహుబ‌లి`, `ఆర్‌.ఆర్‌.ఆర్‌` కోసం జ‌క్క‌న్న వేసిన ప‌బ్లిసిటీ ఎత్తులకు బాలీవుడ్ మేధావులు కూడా చిత్త‌యిపోయారు. ఓ హాలీవుడ్...

జ‌గ‌న్ కు షాక్… వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థికి 18నెల‌ల జైలు

వైసీపీ అధినేత జ‌గ‌న్ కు మ‌రోషాక్ త‌గిలింది. వైసీపీ ఎమ్మెల్యేగా మండ‌పేట అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు కోర్టు 18నెల‌ల జైలు శిక్ష విధించింది. 28 సంవ‌త్స‌రాల క్రితం...

కాంగ్రెస్ మేనిఫెస్టో వర్సెస్ బీజేపీ మేనిఫెస్టో ..!!

లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని బీజేపీ...ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్ మేనిఫెస్టోకు రూపకల్పన చేసి విడుదల చేశాయి. కాంగ్రెస్ న్యాయ్ పత్ర్ పేరుతో బీజేపీ సంకల్ప్ పత్ర్ పేరుతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close