బీజేపీకి దొరికిన పీవోకే అస్త్రం !

బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంటోందని ప్రచారం జరుగుతున్న సమయంలో రిజర్వేషన్ల రద్దు పై ప్రజల్లో జరిగిన చర్చ ఆ పార్టీని సమస్యల్లోకి నెట్టింది. చచ్చినా రిజర్వేషన్లు రద్దు చేయబోమని ప్రజల్ని బతిమాలుకోవాల్సి వచ్చింది. నాలుగు విడతలు అలా గడిచిన తర్వాత బీజేపీకి ప్రజల్ని భావోద్వేగాల్లో ముంచే అస్త్రం దొరికింది. అదే పాక్ ఆక్రమిత కశ్మీర్.

పాక్ ఆక్రమిత కఅక్కడ కొన్నేళ్లుగా నిత్యం ఆందోళనలు, తిరుగుబాట్లు జరుగుతున్నాయి. తాజాగా ద్రవ్యోల్బణం, అధిక పన్నులు, విద్యుత్తు కొరత పై జమ్ముకశ్మీర్‌ జాయింట్ ఆవామీ యాక్షన్‌ కమిటీ ఆందోళనలు చేపట్టింది. పీవోకే హింసతో దద్దరిల్లింది. పీవోకే నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తును మిగతా పాకిస్థాన్ వాడుకుంటోంది. కానీ పీవోకేకు కరెంట్ లేదు. కనీసం గోధుమ పిండి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఈ వివక్షను నిరసిస్తూ తిరుగుబాటు మొదలైంది. స్వాతంత్య్రం కావాలంటూ రోడ్లపైకి వస్తున్నారు. పీవోకేను భారత్‌ లో కలుపాలని కోరుతూ పోస్టర్లు వెలిశాయి.

ఇక పీవోకేను రాజకీయ అంశంగా మార్చుకున్న బీజేపీ ఊరుకుంటుందా ?. రంగంలోకి దిగిపోయింది. మూడో విడతకు ముందు నుంచే… పీవోకే పై ప్రకటనలు ప్రారంభఇంచారు. హోం మంత్రి అమిత్ షా తెలంగాణలోని నాగర్ కర్నూల్ సభలోనూ ఇదే అంశం లేవనెత్తారు. పీవోకే భారత్ కే చెందుతుంద‌ని తెలిపారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని తుదముట్టించాలంటే ఆక్రమిత కశ్మీర్ స్వాధీనం చేసుకోవాల్సిందేనని ప్రకటించారు. ఇప్పుడు ప్రతి సభలోనూ పీవోకేను హైలెట్ చేస్తున్నారు.

గతంలో ఆర్టికల్ 370 రద్దు సమయంలో పీవోకేను ఎప్పటికైనా స్వాధీనం చేసుకుంటామని అమిత్ షా గొప్పగా చెప్పారు. మూడో సారి గెలిస్తే అదే జరుగుతుందని ప్రజలకు చెప్పడం ప్రారంభించారు. బీజేపీకి ఇది అనుకూలమైన పరిణామమే. ఇలాంటి వాటిని సమర్థంగా వాడుకోవడంలో ఆ పార్టీకి సాటి ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close