బీజేపీ రూ. 15 లక్షలు – టీఆర్ఎస్ రూ. 10 లక్షలు..! ఎవరు ముందిస్తారు..?

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త రచ్చ ప్రారంభమైంది. దళిత బంధు పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ ఉద్యమం ప్రారంభించారు. బీజేపీ శ్రేణులు ఊరూరా వెళ్లి దరఖాస్తులు చేయించాలని ఆయన కార్యక్రమానికి రూపకల్పన చేశారు. రూ. పది లక్షలు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరిస్తున్నారు. ఈ ఉద్యమంపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. బండి సంజయ్ దరఖాస్తులు స్వీకరిస్తున్నది ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇస్తమన్న రూ. 15 లక్షల కోసం అని.. మంచి ప్రయత్నం చేస్తున్నారని.. త్వరగా అందరికీ ఇప్పించాలని ట్వీట్ చేశారు. దరఖాస్తు దారులందరూ ఆయన్నే ఆడగాలన్నారు.

2014 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ నినాదం నల్లధనం వెనక్కితీసుకు వచ్చి రూ.15 లక్షలు ప్రతి ఒక్కరి అకౌంట్‌లో వేస్తామని చెప్పడం. అయితే ఆ తర్వాత నల్లధనం పేరు చెప్పి నోట్లనురద్దు చేశారు కానీ ఎలాంటి మనీ అకౌంట్లలో వేయలేదు. జన్‌ధన్ ఖాతాలు తెరిచిన వారందరూ ఎంతో ఆశగా చూశారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి స్పందన రాలేదు. కానీ ఎన్నికల్లో ఎన్నో చెబుతాం.. అన్నీ ఇస్తామా ఏంటి అన్నట్లుగా బీజేపీ పెద్దలు ప్రకటనలు చేశారు. ఆ హామీని తర్వాతఎన్నికల్లో మర్చిపోయారు. కానీ విపక్షాలు మాత్రం విమర్శలు చేస్తూనే ఉంటాయి.

తాజాగా కేసీఆర్ రూ. పది లక్షలు దళితులకు ఇస్తామని ప్రకటించడంతో… అలా ఇవ్వలేరని ఇచ్చినా.. అందరికీ ఇవ్వలేరన్న ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు దరఖాస్తుల ఉద్యమం ప్రారంభించింది. దీనికి కౌంటర్‌గా కేటీఆర్ గతంలో ఇచ్చిన రూ. పదిహేను లక్షల హామీని తెరపైకి తీసుకు వచ్చారు. బండి సంజయ్ పోరాటం.. కేటీఆర్ కౌంటర్ మధ్య.. ముందు ఎవరు హామీని అమలు చేస్తారోనని నెటిజన్లు చర్చలు ప్రారంభించారు. రాజకీయ పార్టీలన్నీ ఇలా మభ్య పెడతాయని ఇవ్వవని మరికొంందరు కామెంట్లు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close