టీఆర్ఎస్‌కు గుడ్ బై చెబుతున్న మునుగోడు బీసీ లీడర్లు !

మునుగోడులో ఎలాగైనా గెలవాలని తాపత్రయ పడుతున్న టీఆర్ఎస్‌కు సొంత పార్టీ నేతలు షాకిస్తున్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ .. బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఆయన బీజేపీ పెద్దలతో చర్చల తర్వాత టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. తనకు టీఆర్ఎస్‌లో తీవ్రమైన అవమానాలు ఎదురయ్యాయన్నారు.
తెలంగాణ సాధన ఉద్యమంలో పోరాడిన సహచర ఉద్యమకారులు, మిత్రులు కూడా కనీసం ఒక నిముషం కేసీఆర్‌ను కలవాలంటే తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఉద్యమం చేయవలసి వస్తుంది అనే పరిస్థితి ఉందని తన రాజీనామా లేఖలో బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. తన జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసిన ఆచార్య జయశంకర్ విగ్రహం హైదరాబాద్ లో ప్రభుత్వం తరపున పెట్టలేదన్నారు.

మాజీ ఎంపీని అయిన తనతో మునుగోడు ఉప ఎన్నికల సందర్బంగా ఏ విషయంలోనూ సంప్రదించలేదు. నియోజకవర్గంలో జరిగిన ఆత్మగౌరవ సభలలో సమాచారం ఇవ్వకున్నా, అవమానాన్ని దిగమింగి ఉన్నాను. అభిమానానికి, బానిసత్వానికి చాలా తేడా ఉందన్నారు. ప్రముఖ వైద్యుడైన బూర నర్సయ్య గౌడ్.. భువనగిరి నుంచి ఓ సారి టీఆర్ఎస్ తరపున ఎంపీగా గెలిచారు. ఇటీవన ఆయన టీడీపీ తరపున బరిలో ఉంటారన్న ప్రచారం జరిగింది. అయితే ఎన్నికకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించుకుంది.

అదే సమయంలో మరో టీఆర్ఎస్ సీనియర్ నేత కర్నె ప్రభాకర్ కూడా టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. మునుగోడు నియోజకవర్గానికే చెందిన ఆయన ఉద్యమంలో కీలక పాత్ర పోషించినా ఎప్పుడూ కేసీఆర్ అవకాశాలు కల్పించలేదు. వేచి చూసి చూసి..ఆయన బీజేపీకి వెళ్లాలని అనుకుంటున్నారు. వీరిద్దరూ పార్టీ మారితే.. మునుగోడులో టీఆర్ఎస్‌కు బీసీ వర్గాలు దూరం అయినట్లేనన్న ఆందోళన ఆ పార్టీలో కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close