ప్రముఖ సంగీత దర్శకుడు ఆదేశ్ శ్రీవాత్సవ మృతి

ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ఆదేశ్ శ్రీవాత్సవ (51) నిన్న అర్ధరాత్రి ముంబై, కోకిల బెన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మరణించారు. ఆయన గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు ఇంతకు ముందు 2011లో ప్లాస్మా సెల్స్ క్యాన్సర్ వ్యాధి సోకినప్పుడు దాని నుండి బయటపడగలిగారు. కానీ ఈసారి మాత్రం క్యాన్సర్ మహమ్మారి నుండి తప్పించుకోలేకపోయారు. గత 40 రోజులుగా ఆయనకీ కిమో థెరపీ చికిత్స చేస్తున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో దానినీ కొన్ని రోజుల క్రితమే నిలిపివేశారు. ఆయన భార్య విజేత పండిట్, సంగీత దర్శకులయిన ఆయన సోదరులు లలిత్ మరియు జితిన్ పండిట్ తదితర కుటుబ సభ్యులు అందరూ ఆయన ఆఖరి క్షణాల్లో ఆయన పక్కనే ఉన్నారు. ఆయన సంగీతం సమకూర్చిన ‘చల్తే చల్తే’, ‘బాగ్బన్’ ‘కభీ కుషి కభి గమ్’ ఆయనకు ఎంతో మంచి పేరు తెచ్చాయి. ఆయన చేసిన చివరి సినిమా ‘వెల్కం బ్యాక్’ ఇటీవలే విడుదలయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close