సీఎం జగన్‌ కు సింగర్ అద్నాన్ సమీ “క్లాస్” !

బాలీవుడ్ సింగర్ అద్నాన్ సమీ ఏపీ సీఎం జగన్ రెడ్డి తీరుపై ఆసహనం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా భారత్ పరువు తీయవద్దని సలహా ఇచ్చారు. ప్రత్యేకవాదాన్ని చూపించవద్దని.. అది దేశాన్ని కించపరచడమేనని కోపగించుకున్నారు. అసలేం జరిగిందంటే… ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతూ… ట్వీట్ చేశారు. ఇందులో తెలుగు ఫ్లాగ్ ఈస్ ఫ్లైయింగ్ హై అన్నారు. దీనిపైనే అద్నాన్ షమీ స్పందించారు.

తెలుగు ఫ్లాగ్ అంటే ఏమిటని షమీ ట్విట్టర్‌లోనే సీఎం జగన్ ను ప్రశ్నించారు. అంటే.. ఇండియన్ ఫ్లాగ్ అనే కదా అర్థం అని అడిగారు. మనం మొదట భారతీయులమని .. అందుకే.. మొదట మీరు బారత్ లోనే ప్రత్యేకమని ఆలోచనను పక్కన పెట్టాలని సూచించారు. ముఖ్యంగా అంతర్జాతీయ ఈవెంట్స్ విషయాల్లో మనదంతా ఓ కంట్రీ అనే సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. సెపరేటిస్ట్ ఆలోచనలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో మనం 1947లో చూశామన్నారు. సమీ చేసిన కామెంట్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నిజానికి అద్నాన్ సమీ స్వతహాగా ఇండియన్ కాదు. ఆయన తండ్రి పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేస్తారు. అయితే సమీ లండన్‌లో పుట్టి పెరిగారు. ఆయనకు పాకిస్తాన్ పౌరసత్వం ఉంది. కానీ దాన్ని వదులుకుని ఇండియన్ గా స్థిరపడ్డారు. ఆయనకు భారత ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చింది. సమీ తల్లి కశ్మీర్ వాసి. అయితే సమీ ఇండియాపై అత్యంత భక్తి చూపిస్తారు. ఇప్పుడు ఇదే విషయంలో సీఎం జగన్ చేసిన సెపరేటిస్ట్ వ్యాఖ్యలు ఆయనకు నచ్చలేదు. అందుకే వెంటనే స్పందించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో కల్లోల పరిస్థితి…అందుకే జగన్ కాముష్..?

ఓడిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చారో లేదంటే, తన్నుకొని చావండి అనుకున్నారో ఏమో కాని, ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పల్నాడులో టీడీపీ - వైసీపీ...
video

టీజర్ రివ్యూ : ఇస్మార్ట్ డబుల్ మాస్

https://youtu.be/tq2HmozH_5Y?si=7YJ-IcGKWvYsaRDj రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్‌ సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్'తో అలరించబోతున్నారు. రామ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదల చేశారు. ల్యాబ్‌లో ఉన్న...

ఏపీలో ఉద్రిక్తత… రంగంలోకి కేంద్ర బలగాలు..!!

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండటంతో ఈసీ సీరియస్ అయింది. పల్నాడు జిల్లాలో 144సెక్షన్ విధించాలని జిల్లా...

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close