రామ్‌చ‌ర‌ణ్.. బ్ర‌ద‌ర్ సెంటిమెంట్‌..?

ధృవ‌లో రామ్‌చ‌ర‌ణ్ మేకోవ‌ర్ అదిరిపోయింది. స్టైలింగ్‌, గెట‌ప్‌… వీటిలో మార్పు స్ప‌ష్టంగా క‌నిపించింది. ఇప్పుడు సుకుమార్ సినిమా కోసం అంత‌కంటే ఎక్కువే క‌ష్ట‌ప‌డుతున్నాడు చెర్రీ. ఈ సినిమా కోసం ఇది వ‌ర‌కు లేనంతగా గడ్డం పెంచాడు. బరువు త‌గ్గాడు. సుక్కు సినిమాలో చ‌ర‌ణ్ చెవిటివాడిగా క‌నిపించ‌నున్నాడ‌ని ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఆ ర‌కంగానూ ఇది ప్ర‌యోగాత్మ‌క పాత్రే. పైగా.. 20 ఏళ్ల క్రితం క‌థ ఇది. అప్ప‌టి వాతావ‌ర‌ణాన్ని పునః సృష్టి చేస్తోంది చిత్ర‌బృందం. మాట తీరు, బాడీ లాంగ్వేజ్ కూడా ఆ కాలానికి త‌గ్గ‌ట్టే ఉండాలి క‌దా? అందుకే చ‌ర‌ణ్ ప్ర‌త్యేక క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు.

అన్నింటికంటే ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే ఈ సినిమాలో బ్ర‌ద‌ర్ సెంటిమెంట్ గ‌ట్టిగా ద‌ట్టించార్ట‌. చ‌ర‌ణ్‌కి సోద‌రులుగా ఆది పినిశెట్టి, వైభ‌వ్‌లు క‌నిపించ‌నున్నార‌ని స‌మాచారం. ఈ సినిమా కోసం ప‌ల్లెటూరి ప్రేమ‌లు, రేప‌ల్లె లాంటి టైటిళ్లు వినిపించాయి. ఆఖరికి రేప‌ల్లె టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 1 నుంచి రాజ‌మండ్రిలో చిత్రీక‌ర‌ణ ప్రారంభించ‌నున్నారు. స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close