జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను గచ్చిబౌలిలోని ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆయనకు ఏఐజీలో చికిత్స కొనసాగుతోంది.
మరోవైపు మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు అని సమాచారంతో మాజీ మంత్రి హరీష్ రావు, పలువురు బీఆర్ఎస్ నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా మాగంగి గోపీనాథ్ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు.
ఇటీవలే ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కూడా జరిగింది. కోలుకుంటున్నారని అనుకుంటూ ఉండగానే మాగంటి గోపీనాథ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటహుటినా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు.