ట్యాపింగ్ పరికరాలు తెప్పించింది ఆ ఎమ్మెల్సీనే !

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సినిమాను మించిన ట్విస్టులు నమోదు అవుతున్నాయి. నిఘా పరికరాల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అవసరం. అలా చేస్తే దిగుమతి చేసుకుంటున్న పరికారాలకు ప్రభుత్వం నుంచి నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. దాంతో ఏయే పరికారాలు తెప్పించామో అనేది సులభంగా తెలిసిపోయే అవకాశం ఉండటంతో బీఆర్ఎస్‌కు చెందిన ఓ ఎమ్మెల్సీ రవిపాల్ అనే టెక్నికల్ కన్సల్టెంట్ ను రంగంలోకి తెచ్చారు.
కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేకమైన పరికారాలను రవిపాల్ ద్వారా తెప్పించారు.

ఎస్‌ఐబి కన్సల్టెంట్ రవిపాల్ పని చేశారు. ఇజ్రాయెల్ నుంచి అత్యాధునిక పరికరాన్ని దిగుమతి చేసుకోవడంలో ఆయన సహకరించారని దర్యాప్తులో వెల్లడయినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్లీ తన పలుకుబడి ఉపయోగించి రవిపాల్ తో ట్యాపింగ్ డివైస్‌లను తెప్పించినట్లు సిట్ అధికారులు గుర్తించడంతో సదరు ఎంఎల్‌సిని విచారించేందుకు సిట్ అధికారులు సిద్ధం అవుతున్నారు.

పెద్ద మొత్తంలో నిఘా పరికరాలను అనధికారికంగా తెప్పించేందుకు రవిపాల్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీని ఉపయోగించుకున్నారు. ఆ కంపెనీ పేరుతో పేరుతో ఇజ్రాయెల్ పరికరాలను తెప్పించి వాటిని సదరు ఎంఎల్‌సికి అప్పగించగా ఆయన వాటిని మరో ప్రైవేట్ వ్యక్తికి అప్పగించడంతో ఆ మేరకు ఫోన్ ట్యాపింగ్ లు జరిగినట్లు చెబుతుననారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో సదరు ఎంఎల్‌సి ఎవరు అంటే.. .బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు. రాజకీయంగా అంత యాక్టివ్ గా ఉండరు కానీ.. తెర వెనుక వ్యవహారాలు మాత్రం చక్కబెడతారని.. ఇప్పుడు నిండా ఇరుక్కుపోయినట్లేనని బీఆర్ఎస్‌లో గుసగుసలు ప్రారంభమయ్యాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి

దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి...

గాజు గ్లాస్ గుర్తుపై కూటమికి పాక్షిక రిలీఫ్

జనసేన పోటీ చేస్తున్న ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పార్లమెంట్ అభ్యర్థులకు, అలాగే జనసేన పోటీ చేస్తున్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని...

శాంతి భద్రతల వైఫల్యం…జగన్ రెడ్డిని బుక్ చేసిన పోసాని

ఏపీలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో డ్రామాను క్రియేట్ చేయడం వైసీపీకి పారిపాటిగా మారింది. గత ఎన్నికల్లో కోడికత్తి కేసుతో సానుభూతి పొందిన జగన్ రెడ్డి, ఈ ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు గులకరాయి దాడిని...

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

HOT NEWS

css.php
[X] Close
[X] Close