కాంగ్రెస్ జిల్లాల జోలికెళ్తే బీఆర్ఎస్‌ చేతికి సెంటిమెంట్ అస్త్రం !

తెలంగాణలో రాజకీయ అవసరాల కోసం ఏర్పాటు చేసిన జిల్లాలతో పాలనా పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో జిల్లాలో ఇద్దరు, ముగ్గురు జడ్పీటీసీలు లేని పరిస్థితి ఉంది. ఈ సమస్యలన్నింటినీ అధిగమించడానికి జిల్లాల పునర్వ్యవస్థీకరణైప రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. రాజకీయంగా కాకుండా జ్యుడిషీయల్ కమిషన్‌ను ఏర్పాటు చేసి నిర్ణయంతీసుకోవాలనుకుంటున్నారు.

తెలంగాణలో మొత్తం పార్లమెంట్ నియోజక వర్గాలు 17 ఉన్నాయి. ఈ లెక్క చూస్తే పదిహేడు జిల్లాలు అవసరం అవుతాయి. జనాభా లెక్కల ప్రకారం చేస్తే 22 జిల్లాలు అయ్యే అవకాశం ఉంది. ఎలా చూసినా జిల్లాల సంఖ్య ఈ రెండింటి మధ్యే ఉంటుందని 33గా ఉండే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. అంటే కనీసం పది జిల్లాలు తగ్గిపోతాయి. ఇదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఊపిరి పోసినట్లే అవుతుంది. జిల్లాల సెంటిమెంట్ తో రాజకీయాలు చేసే అవకాశం ఉంటుంది.

కొత్త జిల్లాలు, జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్ని చోట్లా పెరిగిపోయింది. ఇప్పుడు జిల్లాలు తగ్గిస్తే ఆయా జిల్లాల్లో అసంతృప్తి ఏర్పడుతుంది. భూముల విలువలు తగ్గిపోతాయని బీఆర్ఎస్ ఉద్యమాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రజలను కన్విన్స్ చేయగలిగితే ఏ సమస్యా ఉండదు. రేవంత్ సర్కార్ ప్రజలకు… జిల్లాల తగ్గింపు వల్ల ప్రయోజనాల గురించి చెప్పిఅడుగు ముందుగు వేయాలి… లేకపోతే బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చినట్లే అవుతుందన్న అభిప్రాయం కాంగ్రెస్ లోనే వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close