ఏపీ ప్రభుత్వం నగదు బదిలీ పథకాలు వరుసగా అమలు చేస్తండటం .. చెప్పినట్లుగా అమలు చేస్తూండటంతో వైసీపీలో చురుకుపుడుతోంది. రెండు వేలు లోకేష్ ఖాతాలో పడ్డాయని.. 30లక్షల మంది విద్యార్థులకు ఎగ్గొట్టారని చేస్తున్న ప్రచారాల్లో పస లేదని తేలిపోయింది. దీంతో అర్థం కాకుండా లెక్కలు మాట్లాడే మేధావిగా వైసీపీ చెప్పుకునే .. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ని రంగంలోకి దింపారు. ఆయనకు పార్టీ ఆఫీసుకు వచ్చి మాట్లాడేందుకు తీరిక లేదేమో కానీ.. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం పెట్టారు.
ఎప్పట్లాగే ఆయన.. అప్పులు ఎక్కువ చేస్తున్నారని.. సంపద సృష్టి జరగడం లేదని.. ఆయన పద్దతిలో ఆయన చెప్పుకుపోయారు. సంబంధం లేని విషయాలతో అతకని సెటైర్లు వేసి.. వైసీపీ వాళ్లకు గిలిగింతలు పెట్టే ప్రయత్నం చేశారు. కియా పరిశ్రమ పెట్టాలని వైఎస్ఆర్ చచ్చిపోక ముందే ఆ కంపెనీకి లేఖ రాశానని అసెంబ్లీలో ప్రకటించినప్పుడు ఆయన ఎంత కామెడీ చేస్తారో అందరికీ తెలిసింది. ఆ స్థాయి సెటైర్లు మళ్లీ వేసే వరకూ నవ్వు రాకపోవచ్చు.
కానీ ఆ చెప్పేదేదో.. వైసీపీ ఆఫీసుకు వచ్చి చెప్పవచ్చు కదా అనేది చాలా మంది వైసీపీ నేతలకు వస్తున్న డౌట్. ఆయన ఓడిపోయినప్పటి నుంచి కనిపించడం లేదు. హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు. సొంత నియోజకవర్గంలో కనిపించడం లేదు. ఆయనపై చాలా ఆరోపణలు ఉన్నాయని విచారణ జరుగుతాయని ప్రచారం జరిగినప్పుడల్లా కనిపించకుండా పోతున్నారు. కానీ పార్టీ పెద్దలు అడిగినప్పుడు ఓ సారి హైదరాబాద్లో మొక్కుబడిగా ప్రెస్మీట్ పెట్టి.. మ మ అనిపిస్తున్నారు.