పోలవరం పూర్తి నిధులను బుగ్గన సాధించారా..!?

పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద గండాన్ని గట్టెక్కినట్లుగా కనిపిస్తోంది. ఎలాగైనా.. పెరిగిన అంచనాలను ఆమోదించుకోవాలన్న లక్ష్యంతో మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి… కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశమయ్యారు. ఆయన వెంట నీటి పారుదల మంత్రి అనిల్ కూడా ఉన్నారు. భేటీ తర్వాత వారి ముఖాల్లో వెలుగు కనిపించింది. మారిన అంచనాలకు కేంద్ర జలసంఘం ఆమోదం లభించిందని.. కేంద్ర ఆర్థికశాఖ నుంచి కూడా అనుమతులు రానున్నాయని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు గతంలో ప్యాకేజీకి ఒప్పుకోవడంతోనే సమస్య వచ్చిందని.. ఇప్పుడా చిక్కు ముళ్లన్నింటినీ విప్పుతున్నామన్నారు.

కేంద్రం చెప్పినట్లుగా ఇరవై వేల కోట్లతో ప్రాజెక్ట్ పూర్తయ్యే పరిస్థితి లేదని.. సవరించిన అంచనాలను ఆమోదించాల్సిందేనని.. బుగ్గన పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది. పీపీఏ సమావేశంలోనూ.. తక్కువ మొత్తానికి కాదని మినిట్స్‌లో పొందు పరిచారు. అయితే.. పెరిగిన మొత్తం ఇవ్వాలని సిఫార్సు చేయలేదు. దీంతో.. ఎలాగైనా… పెంచిన అంచనాలను ఆమోదింప చేసుకోవాలని ప్రభుత్వ పెద్దలు సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. పలుమార్లు ఢిల్లీకి వచ్చిన బుగ్గన పనులు పూర్తి చేస్తున్నారు. సానుకూలంగా స్పందించారని చెప్పిన బుగ్గన.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు రావాలని షెకావత్‌ను కోరారు.

ఆయన 15 రోజుల్లో వస్తానని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చిందని సమాచారం అందిన తర్వాత.. సీఎం జగన్ పోలవరం పర్యటన ఖరారయింది. సోమవారం ఆయన పోలవరంలో క్షేత్ర స్థాయిలో పర్యటించాలని నిర్ణయించారు. పోలవరం పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్ట్ సంస్థను ఇప్పటికే ఆదేశించారు. పోలవరానికిసంబందించి ఇప్పటికీ ఇవ్వాల్సిన నిధులను.. ఆ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టేలా ప్రత్యేక ఖాతా ద్వారా విడుదల చేయనున్నారు. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని తేల్చినట్లుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close