లోక్ సభ ఎన్నికలు…ఏ పార్టీ ఏ అంశాన్ని హైలెట్ చేసిందంటే..?

ఎంపీ ఎన్నికలను తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.మెజార్టీ సీట్లే లక్ష్యంగా నెల రోజులుగా తీరిక లేకుండా ప్రచారాన్ని పరుగులు పెట్టించాయి. ప్రత్యర్ధి పార్టీలపై అనేక ఆరోపణలు, విమర్శలతో ఎండలను మించి పాలిటిక్స్ ను వేడెక్కించగా మే 13న ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలో నిక్షిప్తం చేయనున్నారు.

అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధానంగా రిజర్వేషన్ల అంశాన్ని ప్రచారాస్త్రంగా బీజేపీని టార్గెట్ చేసింది.బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని.. వందేళ్ల ఆర్ఎస్ఎస్ ఎజెండా కూడా ఇదేనని ఎన్నికల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా చెప్తూ వచ్చారు. రైతు రుణమాఫీని పంద్రాగస్ట్ లోపు పూర్తి చేస్తామనే హామీని రేవంత్ తరుచుగా లేవనెత్తడం కనిపించింది.

బీజేపీ మాత్రం కాంగ్రెస్ ను డిఫెండ్ చేయడానికే ఎకువ ప్రాధాన్యత ఇచ్చింది. అభివృద్ధి అంశాన్ని ప్రస్తావించకుండా బీజేపీతో రిజర్వేషన్లకు ఎలాంటి డోకా ఉండదని, కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని మోడీతో సహా రాష్ట్ర నేతలు కూడా ఈ అంశాన్ని ఎక్కువగా జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే, మోడీతోనే దేశానికి సమర్ధవంతమైన పాలన అందుతుందని రాష్ట్ర నేతలు వ్యాఖ్యానించడం కనిపించింది.

బీఆర్ఎస్ మాత్రం రైతు సమస్యలపైనే ఎక్కువగా ఫోకస్ చేసింది. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కృత్రిమ కరువు అంటూ అధికార పార్టీపై విమర్శలు చేసింది. ఈసారి కేంద్రంలో ఏ పార్టీకి మెజార్టీ రాదని.. బీఆర్ఎస్ కు 10 – 12సీట్లు వస్తే కేంద్రంలో బీఆర్ఎస్సే కింగ్ మేకర్ అవుతుందన్నారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదుల్లో ప్రధానంగా చర్చకు నిలిచాయి.

తెలంగాణ ప్రజలు ఎవరి ప్రచారాన్ని విశ్వసించారో తేలేందుకు, ఏ పార్టీ ప్రచారం జనాలను ఎక్కువగా ఆలోచింపజేసిందో తెలుసుకునేందుకు మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close