బీజేపీ ఎమ్మెల్యేలకు రేవంత్ గేట్లెత్తగలరా ?

కాంగ్రెస్‌లో చేరికల కోసం తాము గేట్లెత్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పెద్ద ఎత్తున బీఆ్ఎస్ నేతల్ని చేర్చుకుంటున్నారు. కానీ ఒక్క బీజేపీ ఎమ్మెల్యే జోలికి వెళ్లడంలేదు. తాము తల్చుకుంటే.. ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నందుకు.. బీజేపీ నుంచి వైల్డ్ రియాక్షన్ వచ్చింది. అయితే చేరికల విషయంలో కోమటిరెడ్డి పాత్ర శూన్యం కాబట్టి.. బీజేపీ హైకమాండ్ సీరియస్ గాతీసుకునే చాన్స్ లేదు. అయితే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని చేర్చుకునే ధైర్యం చేస్తారా అంటే.. ఇప్పుడా లొల్లి అవసరం ఏముంది అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు బీజేపీ తరపున గెలిచారు. కొద్ది రోజుల కిందట ఆయన రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీ అయ్యారు. కానీ ఆయన కాంగ్రెస్‌లో చేరికపై ఎక్కడా ప్రచారం లేదు. ఆయన ప్రత్యర్థిని కాంగ్రెస్‌లో చేర్చుకుని ఆయనకు చోటు లేదని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్‌లో ఉండి.. బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన మహేశ్వర్ రెడ్డి మంత్రి పదవి ఇస్తే..కాంగ్రెస్ లోకి వస్తానని చెప్పారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. కానీ ఆయన ఆసక్తిని కాంగ్రెస్ లైట్ తీసుకుంది.

బీజేపీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రేవంత్ టార్గెట్ చేస్తే.. వీరిలో కనీసం నలుగుర్ని గెట్లేత్తి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించవచ్చు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ జోలికి వెళ్లలేదు. అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి టీడీపీ, కాంగ్రెస్ ను దెబ్బకొట్టడంపైన మాత్రమే దృష్టి పెట్టారు. అలాగే ఇపుడు రేవంత్ కూడా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలను టార్గెట్ చేస్తున్నారే కాని కమలంపార్టీ జోలికి వెళ్ళటంలేదు. అలా వెళ్తే ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి పరిస్థితిపై పూర్తి అవగాహన ఉంది. మోడీని బడే భాయ్ అని సంబోధించి ఆయనకు తనపై అభిమానం ఉండేలా చూసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close