దిల్ రాజు పై పోలీస్ కేసు.

నిర్మాత దిల్ రాజు పై కేసు వేసారు నవలా రచయిత్రి శ్యామలా రాణి. తన నవల “నా మనసు కోరింది నిన్నే” ని కాపీ కొట్టి దిల్ రాజు “మిస్టర్ పర్ఫెక్ట్” సినిమా తీసారని ఆమె ఆరోపించారు. ఆ మేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో “భావ చౌర్యం” కేసు నమోదైంది.

మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా 2011 లో విడుదలయింది. ప్రభాస్ , కాజల్, తాప్సీ హీరో హీరోయిన్లు గా వచ్చిన ఈ సినిమా కి దశరథ్ దర్శకత్వం వహించగా రచనా సహకారాన్ని అందించింది బాబీ, అబ్బూరి రవి. బాబీ ప్రస్తుతం “జై లవకుశ” సినిమా కి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక శ్యామలా రాణి “నా మనసు కోరింది నిన్నే” నవల గోపాల కృష్ణ, కావ్య, శిరీష అనే మూడు పాత్రల మధ్య జరుగుతుంది. కావ్య పాత్ర ఫాస్ట్ అమ్మాయి కాగా శిరీష పాత్ర గోపాల కృష్ణే లోకంగా భావించే పాత్ర. గోపాలకృష్ణ – కావ్యల మధ్య ఉన్నది ప్రేమా, ఆకర్షణా, వీళ్ళ నిర్ణయాలు గోపాల కృష్ణే లోకంగా భావించే శిరీష జీవితాన్ని ఎలా ప్రభావితం చేసాయి అనే అంశం తో ముమ్మిడి శ్యామలారాణి వ్రాసిన ఈ నవల కొనసాగుతుంది. ఇక పూర్తి స్థాయి లో వీటి రెండింటి మధ్య పోలికలు తేడాలు తేల్చాల్సింది కోర్టే.

అయితే 2011 లో ఈ సినిమా విడుదలయి, పలుమార్లు టివి లో కూడా ప్రసారమైంది. ఇంత ఆలస్యంగా రచయిత్రి కేస్ వేయడం కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.